త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ఒకే చోట 4 ఏళ్లు దాటితే.. బదిలీ తప్పనిసరి..

Telangana | రాష్ట్రంతో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పర్వం కొనసాగనుంది. మే 1 నుండి మే 31 వరకు బదిలీ ప్రక్రియను చేపట్టనున్నారు. మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.

S

Telangana | Published On Apr 21, 2026, 6.28 pm IST

Telangana | ఒకే చోట 4 ఏళ్లు దాటితే.. బదిలీ తప్పనిసరి..
Advertisement

మే 1 నుంచి 31 వరకు
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు
తిరిగి జూన్ 1 నుంచి బదిలీలపై నిషేధం

Telangana | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంతో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పర్వం కొనసాగనుంది. మే 1 నుండి మే 31 వరకు బదిలీ ప్రక్రియను చేపట్టనున్నారు. మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, నియమావళి ప్రకారం నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. వీటి ప్రకారం.. ఇప్పటిదాకా బదిలీలపై కొనసాగిన నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది.

బ‌దిలీల మార్గ‌ద‌ర్శ‌కాలు ఇలా..

  • ఒకే చోట నాలుగేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి.
  • మూడేళ్లు ఒకే చోట చేసిన వారు బదిలీలకు అర్హులు.
  • 31 మే 2027కి ముందే రిటైర్ అయ్యే వారికి మినహాయింపు.
  • ఒక్కో కేడర్‌లో గరిష్టంగా 40% మందికే బదిలీలు.
  • భార్యాభర్తలు, వికలాంగులు, వైద్య కారణాలకు ప్రాధాన్యం.
  • క్యాన్సర్, కిడ్నీ, హృదయ శస్త్రచికిత్స వంటి కేసులకు ప్రత్యేక ప్రాధాన్యం.
  • కష్ట ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసిన వారికి ప్రాధాన్యం.
  • బదిలీలు పూర్తిగా కౌన్సెలింగ్ విధానంలో నిర్వహణ.
  • ఆన్‌లైన్/వెబ్ ఆధారిత విధానం ద్వారా పారదర్శకతతో బదిలీలు.
  • ఖాళీల జాబితా, అర్హుల జాబితా ముందుగా ప్రకటింపు.
  • ఉద్యోగుల నుంచి 5 ఆప్షన్లు తీసుకోనున్న అధికారులు.
  • కష్ట ప్రాంతాలకు సిబ్బంది లేని పక్షంలో లాటరీ విధానం.
  • బదిలీ ఉత్తర్వులు వచ్చిన 3 రోజుల్లో రిలీవ్ అయినట్లు పరిగణన.
  • జూన్ 1, 2026 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమలు.
Advertisement
Advertisement