త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Review Meeting On Investments | దావోస్ ఒప్పందాలపై సీఎం సమీక్ష: ఆ బ్రాండ్ సంస్థలకే తొలి ప్రాధాన్యం

దావోస్, తెలంగాణ రైజింగ్ సమ్మిట్లలో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష నిర్వహించారు. కంపెనీలకు భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

J

Telangana | Published On Apr 22, 2026, 10.25 pm IST

CM Review Meeting On Investments | దావోస్ ఒప్పందాలపై సీఎం సమీక్ష: ఆ బ్రాండ్ సంస్థలకే తొలి ప్రాధాన్యం
Advertisement
  • సీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష
  • దావోస్, తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఒప్పందాలపై అధికారులతో కీలక చర్చ
  • పెట్టుబడుల సంస్థలను మూడు కేటగిరీలుగా విభజన
  • బ్రాండ్ సంస్థలకు తొలి ప్రాధాన్యం
  • ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, డేటా సెంటర్లకు శుద్ధి (STP) చేసిన నీటి వాడకం
  • పెండింగ్ భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం

CM Review Meeting On Investments |  త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దావోస్ పర్యటనతో పాటు ఇటీవల జరిగిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల (MOUs) పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీల ప్రస్తుత స్థితి (గ్రౌండింగ్ స్టేటస్), ఇంకా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.

ఫ్యూచర్ సిటీలో భూకేటాయింపుల వేగవంతం

ప్రతిష్టాత్మక 'ఫ్యూచర్ సిటీ'తో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రాధాన్యతల వారీగా కంపెనీలకు కేటాయించాల్సిన భూముల వివరాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం.. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలకు కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కంపెనీలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, వారి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.

Telangana CM Reviews Investment MOUs Directs Officials to Expedite Land Acquisition for Global Companies

డేటా సెంటర్లకు ఎస్టీపీ నీరు

హైదరాబాద్‌ కేంద్రంగా ఐటీ, డేటా సెంటర్ల ఏర్పాటుపై సీఎం కీలక సూచనలు చేశారు. డేటా సెంటర్ల నిర్వహణకు అత్యధిక నీరు అవసరమయ్యే నేపథ్యంలో.. ఎస్టీపీ (STP)ల ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఆయా సంస్థలు వినియోగించుకునేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు నీటి వనరుల ఆదా జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

మూడు కేటగిరీలుగా కంపెనీలు.. బ్రాండ్స్ కు పెద్దపీట

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను వాటి సామర్థ్యం, ప్రాధాన్యత ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పేరున్న బ్రాండ్ సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా MOUలు కుదుర్చుకున్న సంస్థలు తమ కార్యకలాపాలను తెలంగాణలో ప్రారంభించేలా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను వెంటనే కల్పించాలని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Telangana CM Reviews Investment MOUs Directs Officials to Expedite Land Acquisition for Global Companies

Advertisement
Advertisement