త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

తెలంగాణ బ్రాహ్మ‌ణ సంక్షేమ ప‌రిష‌త్‌లో వ‌ల‌స‌వాదుల పెత్త‌నం..!

Telangana Brahmin Samkshema Parishad | తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనాన్ని నిరసిస్తూ మంగ‌ళ‌వారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తలపెట్టారు.

S

Telangana | Published On Aug 24, 2026, 8.12 pm IST

తెలంగాణ బ్రాహ్మ‌ణ సంక్షేమ ప‌రిష‌త్‌లో వ‌ల‌స‌వాదుల పెత్త‌నం..!
Advertisement

Telangana Brahmin Samkshema Parishad | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో వలసవాదుల పెత్తనాన్ని నిరసిస్తూ మంగ‌ళ‌వారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తలపెట్టిన తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమానికి బీఆర్ఎస్ మద్దతు కోరుతూ తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక ,తెలంగాణ బ్రాహ్మణా ఉద్యమ కారుల వేదిక ప్రతినిధులు పవన్ కుమార్ శర్మ, రమణ రావు, రామారావు, ప్రసాద్ రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్ర శేఖర్ రెడ్డిని కలిశారు.

కేసీఆర్ బ్రాహ్మణుల సంక్షేమం కోసం సదాశయంతో ఏర్పాటు చేసిన సంక్షేమ పరిషత్‌ను చైర్మన్, వైస్ చైర్మన్లు నిర్వీర్యం చేస్తున్నారనీ, ప్రశ్నించిన వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ ప‌రిష‌త్‌ను సక్రమమైన దారిలో పెట్టేందుకే ఈ దీక్ష చేపట్టినట్టు వారు తెలిపారు.

Advertisement
Advertisement