త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | గోదావ‌రి నీటి వినియోగం, బ‌న‌క‌చ‌ర్ల అనుసంధానంపై సుప్రీంకోర్టులో తెలంగాణ స‌ర్కార్‌కు చుక్కెదురు..

Supreme Court | పోల‌వ‌రం ప్రాజెక్టు, గోదావ‌రి నీటి వినియోగం, బ‌న‌క‌చ‌ర్ల అనుసంధానంపై (Banakacherla) సుప్రీంకోర్టులో (Supreme Court) తెలంగాణ స‌ర్కార్‌కు చుక్కెదురైంది. ఏపీ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేయాల‌ని, ఇంజ‌న్ ఉత్త‌ర్వులు ఇవ్వాల‌న్న అభ్య‌ర్థ‌న‌కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం నిరాక‌రించింది.

G

Telangana | Published On Jul 13, 2026, 1.34 pm IST

Supreme Court | గోదావ‌రి నీటి వినియోగం, బ‌న‌క‌చ‌ర్ల అనుసంధానంపై సుప్రీంకోర్టులో తెలంగాణ స‌ర్కార్‌కు చుక్కెదురు..
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్‌: పోల‌వ‌రం ప్రాజెక్టు, గోదావ‌రి నీటి వినియోగం, బ‌న‌క‌చ‌ర్ల అనుసంధానంపై (Banakacherla) సుప్రీంకోర్టులో (Supreme Court) తెలంగాణ స‌ర్కార్‌కు చుక్కెదురైంది. ఏపీ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేయాల‌ని, ఇంజ‌న్ ఉత్త‌ర్వులు ఇవ్వాల‌న్న అభ్య‌ర్థ‌న‌కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం నిరాక‌రించింది. తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana) వేసిన పిటిష‌న్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేప‌ట్టించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన పిటిష‌న్‌లో లోపాలు ఉన్నాయ‌ని, నిబంధనలకు విరుద్ధంగా లిస్ట్ అయ్యిందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. లోపాలు స‌రిదిద్దే వ‌ర‌కు విచార‌ణ చేప‌ట్ట‌డం కుద‌ర‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ వ్యవహారంలో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నార‌ని తెలంగాణ ప్రభుత్వ తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ 15 మందిలో ఏపీకి మాత్రమే ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. అయితే లోపాలు సరిదిద్దాక విచారణలో మిగతా అంశాలు పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది. పిటిషన్‌పై విచారణ జరపకుండా ప్ర‌తివాదుల‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేమని స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement