త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | ఇంటి పేరుతో ఎన్యుమ‌రేష‌న్ ఫారం.. పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ గౌడ్‌కి SIR నోటీసులు

SIR | తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్య‌క్షుడు (TPCC) మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు (Mahesh Goud) ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటీసు జారీ చేసింది. సెప్టెంబ‌ర్ 8న విచార‌ణ‌కు రావాల‌ని బీఎల్ఓ పేర్కొన్నారు.

G

Telangana | Published On Aug 28, 2026, 6.36 am IST

SIR | ఇంటి పేరుతో ఎన్యుమ‌రేష‌న్ ఫారం.. పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ గౌడ్‌కి SIR నోటీసులు
Advertisement

SIR | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్య‌క్షుడు (TPCC) మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు (Mahesh Goud) ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటీసు జారీ చేసింది. సెప్టెంబ‌ర్ 8న విచార‌ణ‌కు రావాల‌ని బీఎల్ఓ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని సిర్నాప‌ల్లిగ‌డీ ప్రాంతంలో పోలింగ్ బూత్ నంబ‌ర్ 168లో బొమ్మ మ‌హేశ్ కుమార్‌గౌడ్ పేరుతో ఎన్యుమ‌రేష‌న్ ఫారం (Enumeration Form) పూర్తి చేశారు. అయితే 2002 ఓట‌రు జాబితాలో ఆయ‌న పేరు బీ. మ‌హేశ్ కుమార్ గౌడ్ అని ఉంది. దీంతో అధికారులు దానినే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. దీంతో బీఎ అయితే బొమ్మ అయితే బొమ్మ మ‌హేశ్‌కుమార్‌గౌడ్ పేరుతో ఉన్న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను ఆయ‌న గురువారమే అధికారుల‌కు స‌మ‌ర్పించారు.

కాగా, రాష్ట్ర‌వ్యాప్తంగా 92.87 లక్షల మంది ఓటర్లకు బూత్ స్థాయి అధికారులు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఈ ఎస్‌ఐఆర్ (SIR) నోటీసులు అందజేస్తున్నారు. ఇందులో నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది ఉన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు, అందులో పేర్కొన్న తేదీ, సమయానికి తమ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులు, అవసరమైన ధృవపత్రాలతో సంబంధిత ఈఆర్వో (ERO) లేదా ఏఈఆర్వో (AERO) కార్యాలయంలో వ్య‌క్తిగ‌త విచార‌ణ‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

కాగా, స‌ర్ నోటీసులు కేవలం 48 గంటల ముందే ఇస్తున్నారని, వ్యక్తిగతంగా హాజరుకావాలనే నిబంధన వల్ల పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగే ప్రమాదం ఉందని టీపీసీసీ క‌మిటీ ఆందోళన వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో కనీసం 7 రోజుల సమయం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) ని కలిసి విజ్ఞప్తి చేసింది. అయితే నోటీసు వచ్చినంత మాత్రాన ఓటు తొలగిపోదని, వివరాల సరిచూడటానికే ఈ ప్రక్రియ అని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ తప్పుడు పత్రాలు సమర్పిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement
Advertisement