TGSRTC | రాఖీ పండుగకు 5,000 ఆర్టీసీ బస్సులు..
TGSRTC | రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
TGSRTC | త్రినేత్ర.న్యూస్ : రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులు ఆగస్టు 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.
ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, ఆగస్టు 30న ఆదివారం సెలవు కావడంతో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. తిరుగు ప్రయాణాలు 31వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతామన్నారు.
గతేడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులను నడిపించగా, ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 240 బస్సులను అదనంగా పెంచి మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KCR | సోదరీ సోదరుల అనుబంధం అజరామరం : కేసీఆర్
- ●HMWSSB | హైదరాబాద్లో 29న నీటి సరఫరా బంద్
- ●MP Eatala Rajender | నీతి మాటలు చెబుతున్న రంగనాథ్.. నిజంగా హిట్లర్ లెక్క చేశారు : ఎంపీ ఈటల
- ●MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయండి : ఎంపీ వద్దిరాజు
- ●Raksha Bandhan | రక్షాబంధన్ వేళ చంద్రగ్రహణం.. సూతకం ఉంటుందా? రాఖీ కట్టొచ్చా?
- ●Minister Komatireddy Venkat Reddy | ఎన్హెచ్ -65.. ఆ 17 చోట్ల ఫ్లై ఓవర్లు త్వరగా పూర్తి చేయండి

KCR | సోదరీ సోదరుల అనుబంధం అజరామరం : కేసీఆర్

HMWSSB | హైదరాబాద్లో 29న నీటి సరఫరా బంద్

MP Eatala Rajender | నీతి మాటలు చెబుతున్న రంగనాథ్.. నిజంగా హిట్లర్ లెక్క చేశారు : ఎంపీ ఈటల

MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయండి : ఎంపీ వద్దిరాజు




