త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | ఒకదానికొకటి ఢీకొన్న మూడు డీసీఏంలు.. గొర్రెల కాప‌రి మృతి

Road Accident | న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. డిండి మండ‌లం ఎర్ర‌గుంట‌ప‌ల్లి వ‌ద్ద కోదాడ‌-జ‌డ్చ‌ర్ల ర‌హ‌దారిపై మూడు డీసీఎంలు ఒక‌దానికొక‌టి ఢీకొట్టాయి.

G

Telangana | Published On Jun 3, 2026, 10.12 am IST

Road Accident | ఒకదానికొకటి ఢీకొన్న మూడు డీసీఏంలు.. గొర్రెల కాప‌రి మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. డిండి మండ‌లం ఎర్ర‌గుంట‌ప‌ల్లి వ‌ద్ద కోదాడ‌-జ‌డ్చ‌ర్ల ర‌హ‌దారిపై మూడు డీసీఎంలు ఒక‌దానికొక‌టి ఢీకొట్టాయి. దీంతో గొర్రెల కాప‌రి ఎల్ల‌య్య మృతిచెందారు.

విశాఖ‌లో రోడ్డు ప్ర‌మాదం.. కొరియోగ్రాఫ‌ర్ పండు మాస్ట‌ర్‌కు తీవ్ర గాయాలు

టాలీవుడ్ ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ పండు మాస్ట‌ర్ (Pandu Master) రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలోని ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప‌క్క‌న ఆగి ఉన్న కారును కోళ్ల వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంస‌మైంది. అదేస‌మ‌యంలో కారు ప‌క్క‌నే ఉన్న పండు మాస్ట‌ర్ రెండు కాళ్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో స్థానికులు ఆయ‌న‌ను ద‌వాఖాకు త‌ర‌లించారు.

పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరపువలసలో జరుగుతున్న ఓ జాత‌రలో ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంత‌రం కారులో హైద‌రాబాద్ తిరిగి వస్తుండగా.. టీమ్‌లోని ఒక సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో ఆనంద‌పురం స‌మీపంలో డ్రైవర్ రోడ్డుపక్కన ఆపారు. దీంతో పండు మాస్టర్ కారులో నుంచి దిగి రోడ్డుపై నిలబడి ఉన్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కోళ్ల వ్యాన్ వారి కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో పండు మాస్టర్‌తోపాటు ఆయ‌న‌తో ప్ర‌యాణిస్తున్న మ‌రికొంద‌రు కూడా గాయప‌డ్డారు.

Advertisement
Advertisement