త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IAS transfers | తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

IAS transfers | తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

P

Telangana | Published On Jan 17, 2026, 10.42 pm IST

IAS transfers | తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ
Advertisement

IAS transfers | తెలంగాణలో నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిత కొనసాగుతున్న హరితను కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కే నిఖిలను మత్స్యశాఖ డైరెక్టర్‌గా నియమించింది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సీఈవో అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు. ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రేను విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. గవర్నర్‌ జాయింట్‌ సెక్రెటరీగా కొనసాగుతున్న జే భవానీ శంకర్‌ (నాన్‌ కేడర్‌)ను యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా నియమించారు.


Advertisement

తాజావార్తలు

Advertisement