Chamala Kiran Kumar Reddy | ఏపీ నుంచి తక్షణమే తెలంగాణకు రూ.1,270 కోట్లు బదిలీ చేయించాలి: చామల కిరణ్కుమార్ రెడ్డి
Chamala Kiran Kumar Reddy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం నుంచి తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి తక్షణమే రూ.1,270 కోట్ల నిధులను బదిలీ చేయించాలని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి (Chamala Kiran Kumar Reddy) కేంద్రప్రభుత్వాన్ని కోరారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం నుంచి తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి తక్షణమే రూ.1,270 కోట్ల నిధులను బదిలీ చేయించాలని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి (Chamala Kiran Kumar Reddy) కేంద్రప్రభుత్వాన్ని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా విభజన చట్టం ప్రకారం ఏపీ చెల్లించాల్సిన బకాయిలను తెలంగాణపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధులను తిరిగి తెలంగాణకు బదిలీ చేయించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. లోక్సభలో రూల్ 377 కింద చామల మాట్లాడుతూ 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొత్తం బకాయి రూ. 5,894.60 కోట్లు ఉండగా, నిర్ణయించిన నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 59.54 శాతం, తెలంగాణకు 40.46 శాతం బకాయిలు కేటాయించాలని % బాధ్యతలు కేటాయించాల్సి ఉందని చెప్పారు. కానీ దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్పై అదనంగా రూ. 1,052.70 కోట్ల భారం మోపిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లోనూ తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిరసన వ్యక్తం చేస్తూనే ఆగస్టు 2024 వరకు మొత్తం రూ. 1,270 కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు. ఇందులో రూ. 481.82 కోట్లు అసలు మొత్తం కాగా, రూ. 788.18 కోట్లు వడ్డీగా చెల్లించారని వివరించారు. ఈ మొత్తాన్ని తిరిగి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించినప్పటికీ, అవి పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు, సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకుని రూ.1,270 కోట్లను ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





