BRS Press Meet | ప్రతి గింజ కొంటాం అని చేతులెత్తేశారు.. తెలంగాణను కరవు కోరల్లోకి నెట్టిన రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి: బీఆర్ఎస్ ఫైర్
ధాన్యం కొనుగోళ్లు, రైతుభరోసా, పంటల బీమా అమలులో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ మండిపడింది. సీఎం రేవంత్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
- కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతుల పడిగాపులు
- పంటల కొనుగోలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్న బీఆర్ఎస్
- సుమారు రూ.29 వేల కోట్ల రైతుభరోసా బకాయిలు పెండింగ్
- ప్రీమియం కట్టకపోవడంతో 7600 కుటుంబాలకు అందని రైతుబీమా
- క్వింటాల్కు రూ.500 బోనస్ అని చెప్పి, కేవలం 7 రకాల సన్నాలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం కుట్ర
- రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి, రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రుల డిమాండ్
BRS Press Meet | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, రైతుల ధాన్యం కొనడంలో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను నట్టేట ముంచిన ఈ అసమర్థ ప్రభుత్వం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి గింజ కొంటామన్న హామీ ఏమైంది?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గింజ కొంటామని, అవసరమైతే విదేశాలకు పంపిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మాత్రం చేతులెత్తేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 2020లో ఏకంగా 92.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ యాసంగిలో కాంగ్రెస్ సర్కార్ కేవలం 50 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితమైందన్నారు. రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాలు, రోడ్లపై పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ (KCR) ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా రైతుల వద్దకు వెళ్లి అన్ని రకాల పంటలను కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
బోనస్ పేరుతో సన్నాల మోసం..
అధికారంలోకి రాకముందు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ఊరించిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు దాన్ని కేవలం సన్నవడ్లకే, అందులోనూ కేవలం ఏడు రకాలకే పరిమితం చేసి రైతులను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం చెప్పినట్లు ఆ సన్న రకాలను పండిస్తే ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గి రైతులకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. ఎకరాకు 10 క్వింటాళ్లు నష్టపోతే ప్రభుత్వం ఇచ్చే బోనస్ ఏ మూలకు సరిపోతుందని వారు ప్రశ్నించారు. పదేళ్లుగా లేని యూరియా కష్టాలు కూడా ఇప్పుడు కొత్తగా యాప్ (App) తేవడం వల్లే వచ్చాయన్నారు.
రైతుభరోసా ఏదీ? రైతుబీమా ఏదీ?
ఐదు సీజన్లకు గానూ సుమారు రూ.29,358 కోట్ల 'రైతుభరోసా' బకాయిలను ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో రూ.441 కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం (Premium) కట్టకపోవడం వల్ల సుమారు 7,600 బాధిత కుటుంబాలకు 'రైతుబీమా' పరిహారం అందకుండా పోయిందని ఫైర్ అయ్యారు. రాజకీయ కక్షతో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను (Projects) పక్కనపెట్టి తెలంగాణను మళ్లీ కరువు కోరల్లోకి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. రైతాంగాన్ని దారుణంగా వంచించిన ఈ ప్రభుత్వం వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Minister Seethakka | వీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ
- ●Ponnam Prabhakar | ఇబ్బందులుండొద్దు.. పనితీరు మంచిగుండాలే
- ●Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్రావు
- ●RS Praveen Kumar | వారు ఫార్చూనర్ కారులో దర్జాగా ఇంటికెళ్లారు
- ●Koppula Eshwar | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాస్తాం : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
- ●Samantha | సమంత తల్లి కాబోతుందా? - మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్

Minister Seethakka | వీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ

Ponnam Prabhakar | ఇబ్బందులుండొద్దు.. పనితీరు మంచిగుండాలే

Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్రావు

RS Praveen Kumar | వారు ఫార్చూనర్ కారులో దర్జాగా ఇంటికెళ్లారు




