త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Praja Palana | 17న ప‌బ్లిక్ గార్డెన్‌లో ప్ర‌జా పాల‌న దినోత్స‌వం

Praja Palana | ఈ నెల 17న నాంప‌ల్లిలోని ప‌బ్లిక్ గార్డెన్‌లో నిర్వ‌హించే తెలంగాణ ప్ర‌జాపాల‌న దినోత్స‌వానికి విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ సంజ‌య్ జాజు సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

S

Telangana | Published On Sep 10, 2026, 6.52 pm IST

Praja Palana | 17న ప‌బ్లిక్ గార్డెన్‌లో ప్ర‌జా పాల‌న దినోత్స‌వం
Advertisement

ఏర్పాట్ల‌పై సీఎస్ సంజ‌య్ జాజు స‌మీక్ష‌

Praja Palana | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 17న నాంప‌ల్లిలోని ప‌బ్లిక్ గార్డెన్‌లో నిర్వ‌హించే తెలంగాణ ప్ర‌జాపాల‌న దినోత్స‌వానికి విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ సంజ‌య్ జాజు సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌జాపాల‌న దినోత్స‌వం నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌పై గురువారం స‌చివాల‌యంలో సీఎస్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదాబాద్ సీపీ స‌జ్జ‌న‌ర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఐ అండ్ పీఆర్ క‌మిష‌న‌ర్ ముకుందా రెడ్డితో పాటు త‌దిత‌ర సీనియ‌ర్ అధికారులు హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రజా పాలనా దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17న ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద, పబ్లిక్ గార్డెన్‌లో సంబంధిత‌ అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలకు, చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గానూ ఈనెల 15న పూర్తి డ్రెస్ రిహార్సల్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వేయి మంది స్వయం సహాయక మహిళలతో పాటు రెండు వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement