Urea | యూరియాపై ఆందోళన అవసరం లేదు : అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి జానయ్య
Urea | యూరియాపై రైతులకు ఆందోళన అవసరం లేదని, దుష్ప్రచారాలను నమ్మవద్దని రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య సూచించారు. గత పది, పదిహేను సంవత్సరాలుగా ఇతర ఎరువులతో పోలిస్తే యూరియా చౌకగా లభ్యమవుతుండటంతో వివిధ పంటల్లో దాని వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
Urea | యూరియాపై రైతులకు ఆందోళన అవసరం లేదని, దుష్ప్రచారాలను నమ్మవద్దని రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య సూచించారు. గత పది, పదిహేను సంవత్సరాలుగా ఇతర ఎరువులతో పోలిస్తే యూరియా చౌకగా లభ్యమవుతుండటంతో వివిధ పంటల్లో దాని వినియోగం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. దిగుబడిలో పెద్ద మార్పు లేకపోయినా, అధిక యూరియా వాడకం వల్ల ఆరోగ్య, వాతావరణ సమస్యలు పెరిగాయని తెలిపారు. గల్ఫ్ యుద్ధ ప్రభావం వల్ల యూరియా సరఫరా తగ్గినప్పటికీ రైతాంగంపై పెద్ద ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయని అన్నారు. సరఫరా ఆశించినంతగా లభ్యం కానట్లయితే, అదే ధరలతో నానో యూరియా మార్కెట్లో తగినంతగా అందుబాటులో ఉందని చెప్పారు. నానో యూరియా వాడకంతో మొక్కలకు అవసరమైన నత్రజని అందుతుందని, సాధారణ యూరియాతో వచ్చే ఫలితాలే లభిస్తాయని వివరించారు. భారత ప్రభుత్వం ధ్రువీకరించిన జీవన ఎరువులు కూడా యూరియాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని ఆయన సూచించారు. అలాగే పచ్చిరొట్ట విత్తనాలను వినియోగించి తొలకరి వర్షాల సమయంలో పొలాల్లో వేసి, 40 రోజుల్లో వాటిని కలియదున్నితే నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో ప్రభావం కారణంగా ఈ సంవత్సరం వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉన్నందున, బోరు, బావులు, చెరువుల ఆధారిత సాగులో వరికి బదులు పప్పుదినుసులు, నూనెగింజలు మరియు ఇతర మెట్ట పంటలు వేయడం మంచిదని ఆయన సూచించారు. వీటికి యూరియా అవసరం కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని రైతులు పంట మార్పిడి వైపు మొగ్గు చూపాలని, తద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ఉపకులపతి జానయ్య సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు




