త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

బహ్రెయిన్ సముద్రంలో జరిగిన ప్రమాదంలో నిజామాబాద్ వాసి శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

J

Telangana | Published On Jul 6, 2026, 4.55 pm IST

Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి
Advertisement
  • బహ్రెయిన్‌లోని దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో నీట మునిగి నిజామాబాద్ వాసి మృతి
  • మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు
  • 2019 నుంచి బహ్రెయిన్‌లోని ఏంఏసీ (MAC) కంపెనీలో పనిచేస్తున్న బాధితుడు
  • మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

Telangana Man Dies in Bahrain | త్రినేత్ర.న్యూస్ : బతుకుదెరువు కోసం గల్ఫ్ (Gulf) దేశానికి వెళ్లిన ఓ తెలంగాణ వాసిని మృత్యువు సముద్రం రూపంలో కబళించింది. బహ్రెయిన్ (Bahrain) లో జరిగిన ఓ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న వ్యక్తి అకాల మరణంతో అతడి స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

ప్రమాదం ఎలా జరిగింది?

దుర్రత్ అల్ బహ్రెయిన్ (Durrat Al Bahrain) సముద్ర తీరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన శ్రీనివాస్ నీట మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ (Coast Guard) బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) చేపట్టాయి. సహాయక చర్యలు చేపట్టినప్పటికీ.. అప్పటికే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.

2019 నుంచి బహ్రెయిన్‌లోనే

కుటుంబాన్ని పోషించుకునేందుకు శ్రీనివాస్ 2019లో బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడి ఏంఏసీ (MAC) సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి మరణవార్తను కంపెనీ ప్రతినిధులు ఇండియాలోని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. చేతికొచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త విన్న వెంటనే శ్రీనివాస్ ఫ్యామిలీ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రభుత్వానికి వేడుకోలు

తమ బిడ్డను చివరిసారిగా చూసుకునేందుకు శ్రీనివాస్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారులు స్పందించి ఎంబసీ (Embassy) ద్వారా పేపర్ వర్క్ త్వరగా పూర్తయ్యేలా చూసి, మృతదేహాన్ని ఇండియాకు చేర్చాలని వారు కన్నీటిపర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
Advertisement