త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.. తెలంగాణకు దక్కిన గౌరవం: హ‌రీశ్ రావు

Harish Rao | ఆస్తుల కంటే స్థిర అస్తిత్వ‌మే త‌న ప్రాణంగా భావించి తెలంగాణ సాహిత్యం కోసం నందిని సిధారెడ్డి (Nandini Siddha Reddy) ప‌నిచేశార‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వంలో ఉన్న‌త స్థాయి ప‌ద‌వి ఇస్తామ‌న్నా తీసుకోలేద‌ని గుర్తు చేశారు.

G

Telangana | Published On Apr 19, 2026, 11.21 am IST

Harish Rao | సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.. తెలంగాణకు దక్కిన గౌరవం: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఆస్తుల కంటే స్థిర అస్తిత్వ‌మే త‌న ప్రాణంగా భావించి తెలంగాణ సాహిత్యం కోసం నందిని సిధారెడ్డి (Nandini Siddha Reddy) ప‌నిచేశార‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వంలో ఉన్న‌త స్థాయి ప‌ద‌వి ఇస్తామ‌న్నా తీసుకోలేద‌ని గుర్తు చేశారు. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించిన సందర్బంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో హ‌రీశ్ రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. `తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన కోటి రూపాయల నగదుతో పాటు 300 గజాల స్థలాన్ని తిరస్కరించిన గొప్ప వ్యక్తి సిధారెడ్డి. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులను కవులు, కళాకారులను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపిరిపోశాయి. సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం తెలంగాణతో పాటు సిద్దిపేట ప్రాంతానికి దక్కిన గౌరవం.

ఆస్తుల కంటే స్థిర అస్తిత్వమే తన ప్రాణంగా భావించి నందిని సిధారెడ్డి గారు తెలంగాణ సాహిత్యం కోసం పనిచేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఉన్నత స్థాయి పదవి ఇస్తానంటే తీసుకోకుండా సాహిత్య రంగంలో జరగాల్సింది ఇంకా చాలా ఉంది సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి తనకు బాధ్యతలు ఇవ్వాలని కోరారు. దీంతో కేసీఆర్ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి సిధారెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ప్రపంచంలోనే తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో ఎంతో అద్భుతంగా నిర్వహించారు.

ఆంధ్ర వారే ఈ తెలుగు మహాసభలు నిర్వహించవచ్చని తెలంగాణ వారికి తెలుగు మహాసభలు నిర్వహించరాదని సృష్టించిన అపోహాలను తొలగించి ఎంతో గొప్పగా మహాసభలు నిర్వహించారు. నందిని సిధారెడ్డి గారు పొగడ్తలు, సన్మానాలకు దూరంగా ఉంటూ సాహిత్యం కోసం ప్రజల కోసం ఎంతో పని చేశారు. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది.. ఆనాటి కాలంలో ఫేక్ ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు, అంటరానితనం, మద్యపాన నిషేధం, నీటి గోస,వలసలు ఇలా అనేక రంగాల్లో పుస్తకాలు రాసి ప్రజలకు చైతన్యం కల్పించారు.

Advertisement
Advertisement