త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana ACB Raid | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీ వలలో ఆలేరు ఆర్ఐ, జీపీవో

యాదాద్రి జిల్లా ఆలేరులో భూమి రిజిస్ట్రేషన్ ఫైల్ కోసం రూ.14 వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జీపీఓ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

J

Telangana | Published On Aug 24, 2026, 7.10 pm IST

Telangana ACB Raid | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీ వలలో ఆలేరు ఆర్ఐ, జీపీవో
Advertisement
  • యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో ఏసీబీ (ACB) అధికారుల ఆకస్మిక దాడులు
  • రూ.14 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ పూర్ణచందర్ రావు, జీపీవో షేక్ అహ్మద్
  • భూమి రిజిస్ట్రేషన్ రిపోర్టు తహసీల్దార్‌కు పంపేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారులు
  • నిందితులను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన అధికారులు

Telangana ACB Raid | త్రినేత్ర.న్యూస్ : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో అవినీతి అధికారులు ఏసీబీ (ACB) వలలో చిక్కారు. భూమి రిజిస్ట్రేషన్ (Land Registration) పని కోసం ఓ సామాన్యుడిని పీడించి.. లంచం తీసుకుంటూ ఆలేరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI), కొలనుపాక గ్రామ పాలన అధికారి (GPO) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

అసలేం జరిగిందంటే?

అవినీతి నిరోధక శాఖ (ACB) విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. ఆలేరు మండలానికి చెందిన ఆర్ఐ వేముగంటి పూర్ణచందర్ రావు.. కొలనుపాక గ్రామ జీపీవో షేక్ అహ్మద్ ద్వారా ఓ బాధితుడి నుంచి రూ.14,000 లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడి సోదరి విక్రయించిన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం తహసీల్దార్‌కు రిపోర్ట్ (Report) పంపాల్సి ఉంది. ఈ చిన్న పని చేసిపెట్టేందుకు ఆర్ఐ లంచానికి కక్కుర్తి పడ్డాడు.

లంచం తీసుకుంటూ అడ్డంగా..

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నల్గొండ ఏసీబీ రేంజ్ అధికారులు పక్కా స్కెచ్ వేశారు. పథకం ప్రకారం.. జీపీవో షేక్ అహ్మద్ బాధితుడి నుంచి రూ.14,000 లంచం తీసుకుంటుండగా అధికారులు వల పన్ని పట్టుకున్నారు. లంచం డబ్బును అతని వద్ద నుంచి రికవరీ చేశారు. అనంతరం నిందితులిద్దరినీ నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు (Special Judge for SPE & ACB cases) జడ్జి ముందు హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

మీకు ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఫోన్ చేసి వేధిస్తున్నారా?

ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ వద్ద నుంచి చట్టబద్ధమైన పని కోసం లంచం అడిగితే భయపడకండి. వెంటనే తెలంగాణ ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయండి. లేదా వాట్సాప్ (WhatsApp) నంబర్ 9440446106 కు ఆధారాలతో సహా సమాచారం ఇవ్వవచ్చు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను ఏసీబీ పూర్తిగా గోప్యంగా ఉంచుతుంది.

Advertisement
Advertisement