త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagoba Jatara | ఆదిశేశుడికి అభిషేకంతో.. అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన‌ నాగోబా జాతర

Nagoba Jatara | రాష్ట్ర పండుగ‌గా గుర్తింపు పొందిన నాగోబా జాత‌ర (Nagoba Jatara) ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో (Keslapur) ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది.

G

Telangana | Published On Jan 19, 2026, 9.24 am IST

Nagoba Jatara | ఆదిశేశుడికి అభిషేకంతో.. అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన‌ నాగోబా జాతర
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర పండుగ‌గా గుర్తింపు పొందిన నాగోబా జాత‌ర (Nagoba Jatara) ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో (Keslapur) ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతికి అద్దంప‌ట్టేలా సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మెస్రం వంశీయులు.. నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి నుంచి నాగోబా విగ్రహం, పూజ సామగ్రితో బయలుదేరారు. డోలు, తుడుం, కాలీకోమ్‌, పెప్రే వాయిస్తూ పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న మైసమ్మ దేవతకు పూజలు నిర్వహించి లోనికి ప్రవేశించారు. నాగోబా దర్శన అనంతరం గంగాజలంతో ఆదివారం అర్ధరాత్రి ఆదిశేషుడికి అభిషేకం చేసి మహాపూజలు నిర్వహించడం ద్వారా ఈ జాతరను ప్రారంభించారు. ఈ సమయంలో మెస్రం వంశీయులు మినహా ఇతరులను అనుమతించలేదు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

23 వరకు జాతర..

నాగోబా మహాపూజతో ప్రారంభమైన జాతర.. ఈనెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ జాతరలో భాగంగా 20న పెర్సపేన్, బాన్ పేన్ పూజలు, 22న నాగోబా దర్బార్ నిర్వహించనున్నారు. 23న బేతాల్ పూజ, మండగాజాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగియనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకండా సరిహద్దు రాష్ట్రాల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు భారీగా తరలి రానున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement