త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Breakfast and Mid-Day Meals for Teachers | టీచ‌ర్ల‌కూ టిఫిన్‌, మ‌ధ్యాహ్న భోజ‌నం

Breakfast and Mid-Day Meals for Teachers | తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో పాటు టీచర్ల కూడా టిఫిన్‌, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివ‌ర్గ‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

S

Telangana | Published On Jul 2, 2026, 6.17 pm IST

Breakfast and Mid-Day Meals for Teachers | టీచ‌ర్ల‌కూ టిఫిన్‌, మ‌ధ్యాహ్న భోజ‌నం
Advertisement

Breakfast and Mid-Day Meals for Teachers | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో పాటు టీచర్ల కూడా టిఫిన్‌, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివ‌ర్గ‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అల్పాహారం, భోజనంలో భాగంగా ఇడ్లీ, సాంబార్, చట్నీ, పూరీ, కర్రీ వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.

తొలి కాగిత రహిత కేబినెట్​..

సీఎం అధ్యక్షతన తొలి కాగిత రహిత కేబినెట్‌ భేటీని నిర్వహిస్తున్నారు. వీబీ జీ రామ్ జీ పథకం అమలుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఖరీఫ్ సీజన్ సంద‌ర్భంగా విత్తనాలు, స‌ర‌ఫ‌రా చేసే ఎరువులపై చ‌ర్చించ‌నున్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేప‌థ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై సమాలోచనలు చేస్తున్నారు. మూసీ తొలి దశ పనులు, మెట్రో విస్తరణపైనా మంత్రివ‌ర్గం చర్చించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలున్నాయి.

Advertisement
Advertisement