త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Duddilla Sridhar Babu | తెలంగాణకు ఏరో డిఫెన్స్ కారిడార్, మెగా లెదర్ పార్కులు.. కేంద్ర మంత్రికి శ్రీధర్ బాబు కీలక వినతులు!

తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి అండగా నిలవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఏరో-డిఫెన్స్, హ్యుందాయ్ పెట్టుబడి తదితర వినతులు సమర్పించారు.

J

Telangana | Published On Jun 22, 2026, 9.43 pm IST

Duddilla Sridhar Babu | తెలంగాణకు ఏరో డిఫెన్స్ కారిడార్, మెగా లెదర్ పార్కులు.. కేంద్ర మంత్రికి శ్రీధర్ బాబు కీలక వినతులు!
Advertisement
  • ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక భేటీ
  • హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్, రాష్ట్రానికి ఏరో-డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని విజ్ఞప్తి
  • జహీరాబాద్‌లో రూ. 8,500 కోట్లతో రానున్న హ్యుందాయ్ ఆర్&డీ (R&D) సెంటర్.. లాజిస్టిక్ హబ్ అభివృద్ధికి కేంద్రం సాయం 
  • రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) ఉత్పత్తి చేసే వంద శాతం యూరియాను తెలంగాణకే కేటాయించాలి

Duddilla Sridhar Babu | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరింత వేగంగా దూసుకుపోయేలా (Industrial growth) రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. 'తెలంగాణ రైజింగ్ విజన్ 2047' లక్ష్య సాధనలో భాగంగా.. సోమవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో (Piyush Goyal) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్‌ను (Ecosystem) బలోపేతం చేసేందుకు కేంద్రం సహకరించాలని పలు కీలక ప్రాజెక్టులపై వినతి పత్రం అందజేశారు.

జహీరాబాద్‌లో లాజిస్టిక్ హబ్ అండ్ నేషనల్ డిజైన్ సెంటర్

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో భారీ పెట్టుబడికి మార్గం సుగమమైందని మంత్రి వివరించారు. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ గ్రూప్ (Hyundai Group) ఏకంగా రూ. 8,500 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ (R&D) సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ తక్షణమే లాజిస్టిక్ హబ్‌ (Logistic Hub) అభివృద్ధికి కేంద్రం చొరవ చూపాలని కోరారు. అలాగే, హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ‘నేషనల్ డిజైన్ సెంటర్’ (National Design Center) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని, ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

డిఫెన్స్ కారిడార్, భవ్య స్కీంపై ఫోకస్

తెలంగాణ తయారీ రంగాన్ని (Manufacturing sector) నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన భవ్య పథకం (Bhavya Scheme) ఫేజ్-1 కింద రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్రంలో 15 నుంచి 20 ప్లగ్ అండ్ ప్లే (Plug and Play) ఇండస్ట్రియల్ పార్కుల కోసం డీపీఆర్‌లు (DPRs) సిద్ధం చేస్తున్నామని, జూన్ – జూలై 2026 అప్లికేషన్ విండోలోనే వీటికి అప్రూవల్ ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా భద్రతా రంగంలో తయారీకి ఊతమిచ్చేలా.. రాష్ట్రానికి ఒక ‘ఏరో – డిఫెన్స్ కారిడార్‌’ను (Aero-Defense Corridor) మంజూరు చేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు.

లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాలపై కీలక వినతులు

పరిశ్రమలతో పాటే లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాలకు సంబంధించి కూడా మంత్రి శ్రీధర్ బాబు కేంద్రం ముందు పలు డిమాండ్లు ఉంచారు.

మెగా లెదర్ పార్కులు: ఎంఎల్ఎఫ్ ఏసీడీ (MLFACD) స్కీమ్ కింద తెలంగాణకు రెండు మెగా లెదర్, ఫుట్‌వేర్ క్లస్టర్లను కేటాయించాలి.

మల్టీ మోడల్ లాజిస్టిక్స్: మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో రూ. 2,050 కోట్లతో నిర్మించనున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు (MMLP) అనుమతివ్వాలి. అలాగే రంగారెడ్డి జిల్లా కోహెడలోని ఇర్రేడియేషన్ ఫెసిలిటీకి ఎక్స్‌పోర్ట్ స్కీమ్ (TIES) కింద ఫండ్స్ రిలీజ్ చేయాలి.

యూరియా 100% రాష్ట్రానికే: రామగుండం ఎరువుల కర్మాగారంలో (RFCL) ఉత్పత్తి అయ్యే మొత్తం యూరియాను తెలంగాణకే కేటాయించాలి. గత ఏడాది లాంటి ఫెర్టిలైజర్ సప్లై ఇబ్బందులు రాకుండా ఈ నిర్ణయం తీసుకోవాలి.

పామ్ ఆయిల్ రైతులు: రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు క్రూడ్ పామ్ ఆయిల్‌పై (Crude Palm Oil) దిగుమతి సుంకాన్ని తిరిగి 44 శాతానికి పెంచాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement