త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | అమిత్ షా, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించాలి : మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy | నీట్ పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షాలను మంత్రివర్గం నుండి తొలగించాలి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది అని ఆయ‌న తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Jul 22, 2026, 3.59 pm IST

Ponguleti Srinivas Reddy | అమిత్ షా, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించాలి : మంత్రి పొంగులేటి
Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్ : నీట్ పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షాలను మంత్రివర్గం నుండి తొలగించాలి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది అని ఆయ‌న తేల్చిచెప్పారు.

నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా పోరాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకులను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ, మంత్రులు దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరమ్మ విగ్రహం నుండి లోక్ భవన్ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొనడం జరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు.

అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా దేశ యువతకు క్షమాపణలు చెప్పి, నీట్ పేపర్ లీక్‌తో 21 మంది విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యార్థులపై నిరంకుశ లాఠీచార్జ్‌కు కారణమైన హోంమంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement