త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mandakrishna Madiga | మాదిగ‌ల‌ను రాజ‌కీయంగా అణిచివేస్తున్న రేవంత్ స‌ర్కార్ : మంద‌కృష్ణ మాదిగ‌

Mandakrishna Madiga | రేవంత్ స‌ర్కార్ మాదిగ‌ల‌ను రాజ‌కీయంగా అణిచివేస్తుంద‌ని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ మండిప‌డ్డారు. రాజ్య‌స‌భ‌కు మాదిగ‌ల‌ను ఒక్క‌రిని కూడా ఎంపిక చేయ‌కుండా మోసం చేశార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Mar 5, 2026, 5.06 pm IST

Mandakrishna Madiga | మాదిగ‌ల‌ను రాజ‌కీయంగా అణిచివేస్తున్న రేవంత్ స‌ర్కార్ : మంద‌కృష్ణ మాదిగ‌
Advertisement

లోక్‌స‌భ‌లో మాదిగ‌ల‌కు ప్రాతినిధ్యం లేదు..
రాజ్య‌స‌భ‌కు సైతం ఎంపిక చేయ‌క‌పోవ‌డం బాధాక‌రం
ఉమ్మ‌డి ఏపీలోనే మాదిగ‌ల‌కు న్యాయం..
వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలోనూ మాదిగ‌ల‌కు అన్యాయం
మాదిగ‌ల విష‌యంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే బెట‌ర్

Mandakrishna Madiga | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ స‌ర్కార్ మాదిగ‌ల‌ను రాజ‌కీయంగా అణిచివేస్తుంద‌ని ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ మండిప‌డ్డారు. రాజ్య‌స‌భ‌కు మాదిగ‌ల‌ను ఒక్క‌రిని కూడా ఎంపిక చేయ‌కుండా మోసం చేశార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. లోక్‌స‌భ‌లో మాదిగలకు ప్రాతినిధ్యం లేదు.. ప్రస్తుతం రాజ్యసభకు సైతం మాదిగలను ఎంపిక చేయకపోవడం బాధాకరమ‌న్నారు.

తన రాజకీయ జీవితంలో మాదిగలు అన్ని వేళలా అండగా ఉన్నారని చెబుతున్న రేవంత్ మాదిగలను రాజకీయంగా అణిచివేస్తున్నారు. మాదిగలను మభ్యపెట్టి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేతకు గురిచేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలకు లోక్‌సభ, రాజ్యసభలలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్‌లో వివక్షకు గురవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తన స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసిన‌ట్లు వార్తలు రావడం తమకు బాధ కలిగించాయి. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తన సహజత్వాన్ని చాటుకుందని మరోసారి నిరూపితమైంది. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటపై నిలబడలేదు. గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు 9 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించి అన్యాయం చేశారు.. మాలల ఒత్తిడికి తలొగ్గి రేవంత్ ఇదంతా చేస్తున్నారని మంద‌కృష్ణ మండిప‌డ్డారు.

ఇటీవల కోదాడలో లాకప్‌డెత్‌లో మాదిగ బిడ్డ కర్ల రాజేష్ చనిపోవడంలో పోలీసుల పాత్ర ఉంది.. చిత్రహింసలకు గురిచేసి చంపారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణం. ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడడం కోసం ఇదంతా చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాగే మరియమ్మ లాకప్ డెత్ జరిగితే పోలీసులను వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని మంద‌కృష్ణ గుర్తు చేశారు.

Advertisement
Advertisement