త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajender | ప్ర‌భుత్వ‌మే విక్ర‌యించిన భూముల‌ను 22ఏ జాబితాలో చేర్చ‌డం దారుణం : ఎంపీ ఈట‌ల‌

Eatala Rajender | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వ‌మే లేఅవుట్లు వేసి విక్ర‌యించిన భూముల‌ను 22ఏ జాబితాలో చేర్చ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

S

Telangana | Published On Aug 18, 2026, 2.06 pm IST

Eatala Rajender | ప్ర‌భుత్వ‌మే విక్ర‌యించిన భూముల‌ను 22ఏ జాబితాలో చేర్చ‌డం దారుణం : ఎంపీ ఈట‌ల‌
Advertisement

Eatala Rajender | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వ‌మే లేఅవుట్లు వేసి విక్ర‌యించిన భూముల‌ను 22ఏ జాబితాలో చేర్చ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. నాంప‌ల్లిలోని బీజేపీ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడారు.

భూ దందాల విష‌యంలో గతంలో కేసీఆర్‌ చేసిన దానికంటే రేవంత్‌ రెడ్డి రెండడుగులు ముందుకెళ్లారని దుయ్యబట్టారు. రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారన్న ఈటల, పేదల నుంచి భూములు లాక్కుని భూమాఫియాకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారన్నారు. ధరణి పోయినా ప్రభుత్వం భూములు లాక్కునే ధోరణి మాత్రం మారలేదని ఈటల ఆక్షేపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం భూ దందాలకు పాల్పడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఆ భూములను సెటిల్‌మెంట్ చేసుకుంటోంది. గతంలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖర్చు చేసిన డబ్బులు ఇలాంటి భూ దందాల ద్వారా వచ్చినవేనని ఈట‌ల రాజేంద‌ర్ సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement
Advertisement