త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Secunderabad-Hisar Express | ఉప్ప‌ల్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో సికింద్రాబాద్‌-హిస్సార్ ఎక్స్‌ప్రెస్‌కు త‌ప్పిన ప్ర‌మాదం..

Secunderabad-Hisar Express | త్రినేత్ర‌.న్యూస్‌: సికింద్రాబాద్-హిస్సార్ సూప‌ర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (Secunderabad-Hisar Express) రైలుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. గురువారం ఉద‌యం హ‌నుమ‌కొండ జిల్లా క‌మ‌లాపూర్ మండ‌లంలోని ఉప్ప‌ల్ రైల్వే స్టేష‌న్ (Uppal Railway Station) స‌మీపంలోని మ‌డిప‌ల్లి గేట్ వ‌ద్ద రైలు ఇంజ‌న్ గిళ్ల విరిగిపోయింది.

G

Telangana | Published On Mar 5, 2026, 11.08 am IST

Secunderabad-Hisar Express | ఉప్ప‌ల్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో సికింద్రాబాద్‌-హిస్సార్ ఎక్స్‌ప్రెస్‌కు త‌ప్పిన ప్ర‌మాదం..
Advertisement

Secunderabad-Hisar Express | త్రినేత్ర‌.న్యూస్‌: సికింద్రాబాద్-హిస్సార్ సూప‌ర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (Secunderabad-Hisar Express) రైలుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. గురువారం ఉద‌యం హ‌నుమ‌కొండ జిల్లా క‌మ‌లాపూర్ మండ‌లంలోని ఉప్ప‌ల్ రైల్వే స్టేష‌న్ (Uppal Railway Station) స‌మీపంలోని మ‌డిప‌ల్లి గేట్ వ‌ద్ద రైలు ఇంజ‌న్ గిళ్ల విరిగిపోయింది. దీంతో అక్క‌డే నాలుగు గంట‌ల‌పాటు రైలు నిలిచిపోయింది. స‌మాచారం అందుకు రైల్వే అధికారులు మ‌ర‌మ‌త్తులు చేప‌ట్టారు. అయినా లాభం లేక‌పోవ‌డంతో మ‌రో ఇంజన్‌తో రైలును ఉప్ప‌ల్ రైల్వే స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే ఈ ఘ‌ట‌న‌తో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ‌తంలోనూ ఉప్ప‌ల్ రైల్వే స్టేష‌న్‌లో సాంకేతిక స‌మ‌స్య‌తో ప‌లు రైల్లు నిలిచిపోయాయి. రెండేండ్ల క్రితం సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ‌లో స‌మ‌స్య రావ‌డంతో హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ వందే భార‌త్‌, ఢిల్లీ-సికింద్రాబాద్ రాజ‌ధాని రైళ్లు సుమారు అర‌గంట పాటు ఆగిపోయాయి. అదేవిధంగా సింగ‌రేణి ప్యాసింజ‌ర్ 20 నిమిషాలు నిలిచిపోయింది.

Advertisement
Advertisement