త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Leopard | బేగంపేట‌లో చిరుత పులి క‌ల‌క‌లం

Leopard | రాష్ట్రంలో చిరుత‌ల సంచారం అధిక‌మైపోతోంది. అభ‌యార‌ణ్యాల నుంచి మైదాన ప్రాంతాల్లోకి చిరుత‌లు ప్ర‌వేశిస్తున్నాయి. అట‌వీ స‌రిహ‌ద్దు ఉన్న జిల్లాల‌కే చిరుత‌లు ప‌రిమితం కావ‌డం లేదు.. ప‌ట్ట‌ణ ప్రాంతాల వైపు చిరుత‌లు ప‌రుగెడుతున్నాయి.

S

Telangana | Published On Jan 18, 2026, 11.41 am IST

Leopard | బేగంపేట‌లో చిరుత పులి క‌ల‌క‌లం
Advertisement

Leopard | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో చిరుత‌ల సంచారం అధిక‌మైపోతోంది. అభ‌యార‌ణ్యాల నుంచి మైదాన ప్రాంతాల్లోకి చిరుత‌లు ప్ర‌వేశిస్తున్నాయి. అట‌వీ స‌రిహ‌ద్దు ఉన్న జిల్లాల‌కే చిరుత‌లు ప‌రిమితం కావ‌డం లేదు.. ప‌ట్ట‌ణ ప్రాంతాల వైపు చిరుత‌లు ప‌రుగెడుతున్నాయి. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రానికి కూత‌వేటు దూరంలో ఉన్న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో చిరుత‌పులి క‌ల‌క‌లం సృష్టిస్తుంది.

భువ‌న‌గిరి జిల్లాలోని తుర్క‌ప‌ల్లి, రాజాపేట మండ‌లాల్లో చిరుత సంచ‌రిస్తుంది. ఆదివారం తెల్ల‌వారుజామున తుర్క‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఇబ్ర‌హీంపూర్ గ్రామంలో ఆవు దూడ‌ల‌పై చిరుత దాడి చేసింది. ఒక ఆవు దూడ‌ను స‌మీపంలోని పొద‌ల్లోకి లాక్కెళ్లి వ‌దిలేసింది చిరుత‌. స‌మాచారం అందుకున్న అట‌వీశాఖ అధికారులు ఇబ్ర‌హీంపూర్ చేరుకుని చిరుత పాద‌ముద్ర‌లను గురించేందుకు య‌త్నించారు.

పక్కనే ఉన్న రాజాపేట మండలం బేగంపేటలో చిరుత పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో ప్ర‌జ‌లు, రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు. వ్య‌వ‌సాయ పొలాల‌కు వెళ్లే రైతులు, కూలీలు గుంపులు గుంపులుగా వెళ్లాల‌ని సూచించారు.

ఈ చిరుత వ‌య‌సు 8 నుంచి 10 ఏళ్లు ఉంటాయ‌ని అధికారులు పేర్కొన్నారు. చిరుత క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సిద్దిపేట అట‌వీ ప్రాంతం నుంచి యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోకి చిరుత ప్ర‌వేశించి ఉండొచ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. అయితే పార్ట్‌న‌ర్ కోసం చిరుత వేట కొన‌సాగిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement