త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రాష్ట్రంలో ప్ర‌మాద‌క‌ర స్థాయికి శాంతిభద్రతలు.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కేటీఆర్‌

KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి ప‌డిపోయాయ‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా చోటుచేసుకుంటున్న ఘోర నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

P

Telangana | Published On May 8, 2026, 3.45 pm IST

KTR | రాష్ట్రంలో ప్ర‌మాద‌క‌ర స్థాయికి శాంతిభద్రతలు.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కేటీఆర్‌
Advertisement

KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి ప‌డిపోయాయ‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా చోటుచేసుకుంటున్న ఘోర నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షసాధింపుల కోసం వినియోగించడం వల్లే ప్రజల భద్రత పూర్తిగా దెబ్బతిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను వేధించడం, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై కేసులు నమోదు చేయడంపైనే పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టిందని విమర్శించారు.

శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే హైదరాబాద్‌లోని అత్యంత భద్రత కలిగిన ప్రాంతంగా భావించే ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య దారుణ హత్యకు గురైన ఘటన వెలుగులోకి రావడం దిగ్భ్రాంతికరమని కేటీఆర్ పేర్కొన్నారు. అదే విధంగా, సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన ప్రజల్లో భయాందోళనలు పెంచుతోందన్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు భద్రత లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. నేరాల నియంత్రణ, ప్రజల రక్షణపై దృష్టి పెట్టాల్సిన పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రభుత్వ విధానాలను విమర్శించే సోషల్ మీడియా వేదికలపై అక్రమ కేసులు పెట్టేందుకు ఉపయోగిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షసాధింపులకు వాడుకోవడం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని ఆరోపించారు. తెలంగాణలో మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు భారీగా పెరిగినట్లు తాజా ఎన్‌సీఆర్‌బీ నివేదికలు వెల్లడిస్తున్నాయని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ వేధింపులు ఆపి, పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజల్లో భరోసా కల్పించేలా పనిచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement