త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | లష్క‌ర్ బోనాలు.. మ‌హంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్‌, టీపీసీసీ చీఫ్‌, మంత్రులు

Revanth Reddy | సికింద్రాబాద్ ల‌ష్క‌ర్ బోనాలను పుర‌స్క‌రించుకొని ఆదివారం ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారిని మంత్రులు కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, వెన్నెల గ‌ద్ద‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. సీఎంకు మేళతాళాలతో ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు.

S

Telangana | Published On Aug 2, 2026, 3.36 pm IST

Revanth Reddy | లష్క‌ర్ బోనాలు.. మ‌హంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్‌, టీపీసీసీ చీఫ్‌, మంత్రులు
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సికింద్రాబాద్ ల‌ష్క‌ర్ బోనాలను పుర‌స్క‌రించుకొని ఆదివారం ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారిని మంత్రులు కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, వెన్నెల గ‌ద్ద‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. సీఎంకు మేళతాళాలతో ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు.

అనంత‌రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement