త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR vs Revanth Reddy | తాండూరు నర్సింగ్ కాలేజీని ఎత్తుకుపోయిన దొంగ రేవంత్: కేటీఆర్

చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక సీఎంగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని కేటీఆర్ దుయ్యబట్టారు. తాండూరు నర్సింగ్ కాలేజీని ఎత్తుకుపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

J

Telangana | Published On Feb 8, 2026, 4.35 pm IST

KTR vs Revanth Reddy | తాండూరు నర్సింగ్ కాలేజీని ఎత్తుకుపోయిన దొంగ రేవంత్: కేటీఆర్
Advertisement

KTR vs Revanth Reddy | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. అధికార కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేసుకోవడం కోసమే అన్నట్లుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పలు మున్సిపాలిటీల్లో పర్యటించారు. తాండూరు, నర్సంపేట మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అంత చెత్త ముఖ్యమంత్రి, నీచమైన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా పర్యటనకు వెళ్తే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతారు.. ప్రజలకు నాలుగు మంచి మాటలు చెబుతారు. కానీ చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక సీఎంగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని కేటీఆర్ దుయ్యబట్టారు. తాండూరు నర్సింగ్ కాలేజీని ఎత్తుకుపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

ktr municipal election campaign in tandur and narsampet

 

కేసీఆర్‌ను తిట్టడం తప్పించి రేవంత్ చేసిందేం లేదు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి రెండేళ్ల నుంచి కేసీఆర్‌ను తిట్టడం తప్పించి చేసింది ఏం లేదన్నారు. ప్రతి రోజూ వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచించడమే రేవంత్ రెడ్డి పనన్నారు. ఈ ఎన్నికల్లో కాకుంటే కాంగ్రెస్ వాళ్లు మరో మూడు సంవత్సరాల దాకా దొరకరు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

ktr municipal election campaign in tandur and narsampet

Advertisement
Advertisement