త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mettu Sai Kumar | కేటీఆర్.. ఇగో స‌న్న బియ్యం.. మీ పుట్టినరోజు కానుక‌గా సర్కార్ పంపింది

Mettu Sai Kumar | కేటీఆర్ జ‌న్మ‌దినం పుర‌స్క‌రించుకొని రేవంత్ స‌ర్కార్ 25 కేజీల స‌న్న బియ్యాన్ని కానుక‌గా పంపింద‌ని.. ర్యాపిడోలో వాటిని కేటీఆర్‌కు చేర‌వేస్తున్న‌ట్లు ఫిష‌రీస్‌ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు. ప్ర‌తి నెలా పంప‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.

S

Telangana | Published On Jul 24, 2026, 1.55 pm IST

Mettu Sai Kumar | కేటీఆర్.. ఇగో స‌న్న బియ్యం.. మీ పుట్టినరోజు కానుక‌గా సర్కార్ పంపింది
Advertisement
  • ఉన్నోళ్లు, లేనోళ్లు అంద‌రూ తినొచ్చు
  • ర్యాపిడోలో 25 కేజీలు పంపిన ఫిష‌రీస్‌ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

త్రినేత్ర‌.న్యూస్‌: కేటీఆర్ జ‌న్మ‌దినం పుర‌స్క‌రించుకొని రేవంత్ స‌ర్కార్ 25 కేజీల స‌న్న బియ్యాన్ని కానుక‌గా పంపింద‌ని.. ర్యాపిడోలో వాటిని కేటీఆర్‌కు చేర‌వేస్తున్న‌ట్లు ఫిష‌రీస్‌ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు. ప్ర‌తి నెలా పంప‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. ఈ సన్న బియ్యం అన్ని పార్టీల వారు, ఉన్నోళ్లు, లేనోళ్లు అందరూ తినొచ్చన్నారు. కేటీఆర్ నిరుపేద కుటుంబం ఇంటిలోకి వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేసినందుకు ధన్యవాదములు తెలుపుతున్నాన‌న్నారు.

స‌న్న బియ్యం వండితే పండ‌గ అనుకునేది..

రేవంత్ స‌ర్కార్‌ కేటీఆర్ పేరుతో తెలంగాణ భవన్‌కి సన్నబియ్యాన్ని పంపుతుంది. దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ. ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే పండగ అనుకునేది. రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణాలో ప్రతి ఇంట్లో పండగ రోజులా చేస్తున్నాడు. కేటీఆర్ నిరుపేద కుటుంబం ఇంటిలోకి వెళ్లి సన్న బియ్యం తో భోజనం చేసినందుకు ధన్యవాదములు. ఈ ప్రజా ప్రభుత్వంలో అందరు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. నిరుపేద కుటుంబం కండ్ల‌ల్లో ఆనందం చూడటమే మా ప్రభుత్వం లక్ష్యం. మా ప్రభుత్వం అమ‌లు చేస్తున్న‌ పథకాలు దేశంలో ఎక్కడా లేవు.

Advertisement
Advertisement