త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | చారిత్రక పరిశోధన ఆధారిత నవలలు రావాలి.. కేటీఆర్ పిలుపు..!|

KTR | సుసంపన్నమైన చరిత్ర కలిగిన తెలంగాణలో చారిత్రక, సామాజిక అంశాలను కొత్త దృష్టితో స్పృశించే నవలలు, ఆవిష్కరణలు మరిన్ని రావాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.

P

Telangana | Published On May 14, 2026, 9.10 pm IST

KTR | చారిత్రక పరిశోధన ఆధారిత నవలలు రావాలి.. కేటీఆర్ పిలుపు..!|
Advertisement

KTR | సుసంపన్నమైన చరిత్ర కలిగిన తెలంగాణలో చారిత్రక, సామాజిక అంశాలను కొత్త దృష్టితో స్పృశించే నవలలు, ఆవిష్కరణలు మరిన్ని రావాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. చెంచుల జీవనం, సంస్కృతిని ప్రతిబింబించేలా నవలను రాయటం అభినందనీయమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి గురించి చెప్పాలో.. ఎవరి గొంతుకై నినదించాలో.. రచయిత సరిగ్గా దాన్ని అందుకున్నారని కేటీఆర్‌ కొనియాడారు. గురువారం నంది నగర్ లోని తన నివాసంలో ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, కోణతం దిలీప్‌, జర్నలిస్టు సంఘం నాయకుడు ఆస్కాని మారుతిసాగర్‌, జర్నలిస్టు తిరుపతి నాయక్‌ తదితరులు కలిసి రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు 'కొండమల్లు' నవల నూతన ఎడిష‌న్‌ను కేటీఆర్‌కు అందజేశారు.

తమ రాజధానిని విస్తరించుకునే ప్రయత్నంలో బ్రహ్మనాయుడు సైన్యం చెంచు నివాసాలపై దాడి చేయడాన్ని ఎదురించే ఈ కథ, చెంచు నాయకుడైన బయ్యన్న చుట్టూ తిరుగుతుంది. అధికార బలం, సైనిక బలగంతో ఉన్న బ్రహ్మనాయుడుతో నేరుగా తలపడలేక తన ప్రతీకార యాత్రలో భాగంగా "కారుకోడి" అనే ఒక ప్రత్యేక జాతి కోడిపుంజును పట్టుకుని, దానిని "కొండమల్లు"గా మారుస్తాడు. 800 ఏళ్ల పురాతన పలనాటీ సీమ చరిత్ర, చెంచుల సామాజిక అంశాలపై జరిపిన పరిశోధన ఆధారంగా ఒక నూతన దృక్కోణంతో రచించిన నవల ఇతివృత్తాన్ని గురించి ప్రజాకవి గోరటి వెంకన్న కేటీఆర్‌కు వివరించారు. తెలంగాణలోని నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గుంటూరు, కర్నూల్‌, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవి, చెంచుల జీవితం, సంస్కృతి, వారి ప్రస్తుత అవసరాల గురించి కూడా కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నేపథ్యం ఉన్న చారిత్రక అంశాల మీద పరిశోధించి నవల రాయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ సూచించారు.

Advertisement
Advertisement