త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha | త‌ప్పుచేయ‌నంత వ‌ర‌కు ఎవ‌రికీ భ‌య‌ప‌డొద్దు: మ‌ంత్రి కొండా సురేఖ‌

Konda Surekha | మ‌నం త‌ప్పు చేయ‌నంత‌వ‌ర‌కు ఎవ‌రికీ భ‌య‌ప‌డొద్ద‌ని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌లో చాలా మార్పులు వ‌చ్చాయ‌ని చెప్పారు.

G

Telangana | Published On May 8, 2026, 1.14 pm IST

Konda Surekha | త‌ప్పుచేయ‌నంత వ‌ర‌కు ఎవ‌రికీ భ‌య‌ప‌డొద్దు: మ‌ంత్రి కొండా సురేఖ‌
Advertisement

Konda Surekha | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌నం త‌ప్పు చేయ‌నంత‌వ‌ర‌కు ఎవ‌రికీ భ‌య‌ప‌డొద్ద‌ని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌లో చాలా మార్పులు వ‌చ్చాయ‌ని చెప్పారు. యువ‌త మత్తుపదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. నిబద్ధతతో పనిచేయాలని తెలిపారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వ‌రంగ‌ల్‌ కాళోజీ కళాక్షేత్రంలో మెగా జాబ్‌మేళాను ఎంపీ క‌డియం కావ్య‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగ‌రాజుతో క‌ల‌సి మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌తిభ‌ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

యువత ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని, నిత్యం మనలో మనం యుద్ధం చేసుకోవాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. యువ‌త ఉద్యోగ‌ ప్రయత్నాలను ఆపొద్దని, కష్టపడి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పారు. ఏఐ వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. నేటి పోటీని తట్టుకుని నిలబడాలని సూచించారు. ఉద్యోగం ఎక్కడైనా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రైవేటు ఉద్యోగంలో రాణించాలంటే స్కిల్‌ ముఖ్యమని చెప్పారు. తల్లిదండ్రుల కళలు నెరవేరాలంటే కష్టపడాలని సూచించారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement