త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | మరోసారి మంచి మ‌నసు చాటుకున్న కోమ‌టిరెడ్డి.. అనాథ‌ల‌కు ఆర్థిక సాయం అందజేత‌

Komatireddy Venkat Reddy | రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లుగా మారిన ఇద్ద‌రికి ఆర్థిక సాయం అందించి అండ‌గా నిలిచారు.

S

Telangana | Published On Jun 13, 2026, 2.38 pm IST

Komatireddy Venkat Reddy | మరోసారి మంచి మ‌నసు చాటుకున్న కోమ‌టిరెడ్డి.. అనాథ‌ల‌కు ఆర్థిక సాయం అందజేత‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లుగా మారిన ఇద్ద‌రికి ఆర్థిక సాయం అందించి అండ‌గా నిలిచారు. క‌ష్ట‌కాలంలో వారికి మ‌నోధైర్యాన్నిచ్చారు. దేవుడు ఎక్క‌డో ఉండ‌డ‌ని.. సాయం చేసే మ‌న‌మంతా దేవుళ్ల‌మేన‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న

న‌ల్ల‌గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన కట్ట ఝాన్సీ, చందు రెడ్డి తల్లిదండ్రులను కోల్పోయి అనాథ‌లుగా మారారు. విష‌యం తెలుసుకున్న కోమ‌టిరెడ్డి త‌క్ష‌ణ‌మే స్పందించారు. వారిద్ద‌రి పేరు మీద చెరో రూ.ల‌క్ష చొప్పున రెండు ల‌క్ష‌ల‌ రూపాయలను అందించారు. వారు చ‌దువుకునే పాఠ‌శాల ఉపాధ్యాయులు బాగా చూసుకునేలా చూడాల‌ని స్థానిక నాయ‌కుల‌కు సూచించారు. ఈ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement
Advertisement