త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | ఎర్ర‌వల్లి నుంచి బ‌య‌ల్దేరిన కేసీఆర్‌.. నందినగర్‌లో భారీగా మోహ‌రించిన‌ పోలీసులు

KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను సిట్ అధికారులు విచారించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఎర్ర‌వ‌ల్లి నుంచి ఆయ‌న హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని కేసీఆర్ నివాసంలో విచారించ‌నున్నారు.

N

Telangana | Published On Feb 1, 2026, 11.48 am IST

KCR | ఎర్ర‌వల్లి నుంచి బ‌య‌ల్దేరిన కేసీఆర్‌.. నందినగర్‌లో భారీగా మోహ‌రించిన‌ పోలీసులు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను సిట్ అధికారులు విచారించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఎర్ర‌వ‌ల్లి నుంచి ఆయ‌న హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని కేసీఆర్ నివాసంలో విచారించ‌నున్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇప్ప‌టికే నందిన‌గ‌ర్ చేరుకున్నారు.

కేసీఆర్ విచార‌ణ దృష్ట్యా నందినగర్ ప‌రిసార‌ల్లో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లు పెట్టి ఎవరినీ లోపలికి అనుతించటం లేదు. కేసీఆర్​ నివాసంలోకి కుటుంబ సభ్యులు, సిట్ అధికారులకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఉద‌యం 11 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్ష‌లు అమలు చేస్తున్నారు. వాహ‌నాల‌ను దారిమ‌ళ్లిస్తున్నారు.

ఈ ప్రాంతాల్లోనే వాహ‌నాల నిలిపివేత‌..
1. నందిన‌గ‌ర్ బ‌స్టాప్
2. నంది న‌గ‌ర్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్
3. జేసీ రెడ్డి చికెన్ సెంట‌ర్
4. యూనియ‌న్ బ్యాంక్ బై లేన్
5. బ‌స‌వ‌తార‌కం రోట‌రీ
6. అగ్ర‌సేన్ జంక్ష‌న్
7. టీఎస్ స్ట‌డీ స‌ర్కిల్
8. ఎన్టీఆర్ భ‌వ‌న్
9. ఎమ్మార్సీ క‌మాన్, రోడ్ నంబ‌ర్ 12
10. సాగ‌ర్ సొసైటీ టీ జంక్ష‌న్

కాగా, కేసీఆర్‌కు సిట్ నోటీసులు, విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని గ్రామాల్లో దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని నేతలను పార్టీ నాయ‌క‌త్వం ఆదేశించింది. మున్సిపాలిటీలు, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వ‌హించాల‌ని, నల్లజెండాలతో నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాల‌ని పిలుపునిచ్చింది.

Advertisement
Advertisement