త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | ఎల్లుండి ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు క‌విత పార్టీ ప్ర‌క‌ట‌న..?

Kavitha | తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) నూత‌న పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారైంది. ఆమె ఈ నెల 27న ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు నూత‌న పార్టీని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు ఆమె సోష‌ల్ మీడియాలో ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

A

Telangana | Published On Mar 25, 2026, 4.18 pm IST

Kavitha | ఎల్లుండి ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు క‌విత పార్టీ ప్ర‌క‌ట‌న..?
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌ : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) నూత‌న పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖ‌రారైంది. ఆమె ఈ నెల 27న ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు నూత‌న పార్టీని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అదే రోజు ఆమె పార్టీని ప్ర‌క‌టించ‌డంతో పాటు పార్టీ గుర్తు, విధివిధానాల‌ను త‌న మెట్టినింటి వేదిక‌గా వెల్ల‌డిస్తార‌ని భావిస్తున్నారు. ఈ మేర‌కు ఆమె సోష‌ల్ మీడియాలో ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 27న ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కు నిజామాబాద్‌లోని జాగృతి కార్యాల‌యంలో కీల‌క‌మైన ప్రెస్ మీట్ ఉంటుంద‌ని, 9.30 గంట‌ల‌కు శ్రీ ర‌ఘునాథ ఆల‌యం (ఖిల్లా రాంమందిర్‌)లో శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల్లో పాల్గొంటార‌ని ఆమె వివ‌రించారు.

Advertisement
Advertisement