SI Chandrasekhar | అత్తగారింట్లో ఉరివేసుకున్న కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్.. ఐదు రోజుల క్రితం భార్య కూడా..
SI Chandrasekhar | కరీంనగర్ (Karimnagar) టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ (SI Chandrasekhar) బలవన్మరణం చెందారు. భార్య మృతితో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ జమ్మికుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింట్లో ఉరివేసుకున్నారు.
SI Chandrasekhar | త్రినేత్ర.న్యూస్: కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ (SI Chandrasekhar) బలవన్మరణం చెందారు. భార్య మృతితో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ జమ్మికుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింట్లో ఉరివేసుకున్నారు. ఎస్ఐ భార్య దివ్య ఐదురోజుల క్రితం గన్నేరుపప్పు తిని ఆత్మహత్య చేసుకున్నది. ఆమె మృతికి భర్తే కారణమని మృతురాలి బంధువులు దాడికి యత్నించారు. గ్రామస్థులు, బంధువుల నిరసనల మధ్యే అంత్యక్రియలు పూర్తిచేశారు.
కాగా, 2016లో ఎస్ఐ చంద్రశేఖర్, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్యకు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజు మాదిరిగానే గత మంగళవారం (మార్చి 17న) కూడా చంద్రశేఖర్.. ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లారు. కాగా దివ్య కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో అదేరోజు ఉదయం గన్నేరుపూలు, ఆకులు మిక్సీ చేసుకొని తాగిన దివ్య.. తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పింది. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ ఆమెను హుటాహుటిన హైదరాబాద్లోని హాస్పిటల్కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందింది.
అయితే, దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమంటూ మృతురాలి బంధువులు దాడికి ప్రయత్నించారు. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య మృతురాలి తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, ఐదు రోజుల కార్యక్రమానికి శనివారం (మార్చి 21) అత్తగారింటికి వచ్చిన ఎస్ఐ చంద్రశేఖర్.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గదిలో నుండి బయటికి రాకపోవడంతో అనుమానంతో చూడగా ఉరి వేసుకొని ఉండటంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Bandi Sanjay | అటువంటి ఫాల్త్ రాజకీయ నాయకుడిని కాదు : బండి సంజయ్
మే 20, 2026

KTR | కరీంనగర్ ‘సింహ గర్జన’కు 25 ఏండ్లు.. ఈ నాలుగే కేసీఆర్ రథ చక్రాలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
మే 17, 2026

Ponnam Prabhakar | ‘సర్’ పై అప్రమత్తంగా ఉందాం: నియోజకవర్గ ఇంచార్జీలు, పరిశీలకులతో పొన్నం
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



