త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponnam Prabhakar | ప‌దేళ్లు ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ నిలిచిపోయింది : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Minister Ponnam Prabhakar | గత 10 సంవత్సరాలుగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రకటించినట్టే ప్రకటించి మధ్య‌లోనే ఆగిపోయింద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌గౌడ్ అన్నారు. శిల్ప‌క‌ళావేదిక‌లో గ్రూప్‌-3 అభ్య‌ర్థుల‌కు నియామ‌క‌ప‌త్రాలు సీఎం రేవంత్‌రెడ్డితో క‌లిసి మంత్రి అంద‌జేశారు.

P

Telangana | Published On Jan 16, 2026, 9.02 pm IST

Minister Ponnam Prabhakar | ప‌దేళ్లు ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ నిలిచిపోయింది : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Minister Ponnam Prabhakar | గత 10 సంవత్సరాలుగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రకటించినట్టే ప్రకటించి మధ్య‌లోనే ఆగిపోయింద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌గౌడ్ అన్నారు. శిల్ప‌క‌ళావేదిక‌లో గ్రూప్‌-3 అభ్య‌ర్థుల‌కు నియామ‌క‌ప‌త్రాలు సీఎం రేవంత్‌రెడ్డితో క‌లిసి మంత్రి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎల్బి స్టేడియం నుంచి శిల్పకళ వేదిక నుంచి రవాణా శాఖ, పంచాయతీ రాజ్, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్ అనేక విభాగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసి ముఖ్యమంత్రి గారే నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేశార‌న్నారు. తెలంగాణ నినాదమే నీళ్లు నిధులు నియామకాలు స్వాభిమానం కోసం జరిగింద‌ని, గత ప‌దేళ్లు సంవత్సరాలుగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రకటించినట్టే ప్రకటించి మధ్య‌లోనే ఆగిపోయిన పరిస్థితి నెల‌కొంద‌న్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అలాంటి ఆటంకాలు తొలగించి నూతన నియామకాలు చేపట్టింద‌న్నారు.

ఆర్టీసీలో 2012లో నియామకాలు చేపడితే ఇప్పటి వరకు చేయలేద‌ని, తాము వచ్చిన తర్వాత ఆర్టీసీలో 3030 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నామ‌న్నారు. 4 కోట్ల మందిలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటే కాంపిటీషన్ ఏవిధంగా ఉంటుందో తెలుసున‌న్నారు. ఏ ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో స్వయంగా ముఖ్యమంత్రి తెప్పించుకొని జాబ్ క్యాలండర్ ద్వారా భర్తీ చేసే కార్యక్రమం చేపడుతున్నార‌ని, తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో అనేక శాఖల్లో ఉంద్యోగాలు భర్తీ చేసింద‌ని తెలిపారు. భవిష్యత్ లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ పారదర్శక సేవలు అందించాల‌ని, విద్యార్థి నాయకుడిగా ఉద్యోగాల భర్తీలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. విద్యకు, ఉపాధి అవకాశాలుకు పెంచడానికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంద‌ని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement