త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jaggareddy | సంగారెడ్డిలో 70 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన జ‌గ్గారెడ్డి

Jaggareddy | సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా మరో 70 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేశారు. ప్రత్యేకంగా 8 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఈ విడతలో సైకిళ్లు పంపిణీ చేశారు.

P

Telangana | Published On May 25, 2026, 7.09 pm IST

Jaggareddy | సంగారెడ్డిలో 70 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేసిన జ‌గ్గారెడ్డి
Advertisement

Jaggareddy | సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా మరో 70 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేశారు. ప్రత్యేకంగా 8 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు ఈ విడతలో సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు మొత్తం 400 మంది చిన్నారులకు సైకిళ్లు అందినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ కార్యాలయంలో ఆధార్ జిరాక్స్‌తో పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విడతల వారీగా సైకిళ్లు అందిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అదే కార్యక్రమంలో, గతంలో పేర్లు నమోదు చేసుకున్న మరో 156 మంది చిన్నారులకు టోకెన్లు పంపిణీ చేశారు. వచ్చే ఆదివారం వారికి సైకిళ్లు అందజేయనున్నట్లు తెలిపారు. సైకిళ్ల పంపిణీ సందర్భంగా జగ్గారెడ్డి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ కొంతసేపు గడిపారు. వారితో కరచాలనం చేస్తూ పలకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు కూన సంతోష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement