MLAs Disqualification | ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
MLAs Disqualification | పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ (MLAs Disqualification) పై స్పీకర్ ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు (Highcourt) పార్టీ మారలేదన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్కు నోటీసులు జారీ చేసింది.
MLAs Disqualification | తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ (MLAs Disqualification) పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు (Highcourt) పార్టీ మారలేదన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పు వెలువరించారు. దీనిని సవాల్ చేస్తూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాశ్గౌడ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





