త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLAs Disqualification | ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు హైకోర్టు నోటీసులు

MLAs Disqualification | పార్టీ మారిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్‌ (MLAs Disqualification) పై స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ (Gaddam Prasad Kumar) వెలువ‌రించిన తీర్పును స‌వాల్ చేస్తూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన రాష్ట్ర హైకోర్టు (Highcourt) పార్టీ మారలేదన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు స్పీక‌ర్‌కు నోటీసులు జారీ చేసింది.

A

Telangana | Published On Mar 25, 2026, 12.58 pm IST

MLAs Disqualification | ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు హైకోర్టు నోటీసులు
Advertisement

MLAs Disqualification | తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్‌ (MLAs Disqualification) పై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Gaddam Prasad Kumar) వెలువ‌రించిన తీర్పును స‌వాల్ చేస్తూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన రాష్ట్ర హైకోర్టు (Highcourt) పార్టీ మారలేదన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు స్పీక‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ప‌ది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార‌లేద‌ని ఇటీవ‌ల అసెంబ్లీ స్పీక‌ర్ తీర్పు వెలువ‌రించారు. దీనిని స‌వాల్ చేస్తూ ప‌లువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. దీనిని విచారించిన న్యాయ‌స్థానం కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని స్పీక‌ర్‌తో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, అరికెపూడి గాంధీ, కాలే యాద‌య్య‌, ప్ర‌కాశ్‌గౌడ్‌, పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, తెల్లం వెంక‌ట్రావుల‌కు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement