Ponguleti Srinivas Rao | ఎన్నికల అఫిడవిట్లో ఎకరం కూడా లేదన్నడు.. ఇప్పుడు వేల కోట్ల భూములెలా వచ్చాయ్?
Ponguleti Srinivas Rao | తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్సభ ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ తెలిపారని.. మరి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.
- అఫిడవిట్లో తప్పులు రాసి మోసం చేశారా? ప్రజలకు అబద్ధాలు చెప్తున్నరా?
- రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్
Ponguleti Srinivas Rao | త్రినేత్ర.న్యూస్: తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్సభ ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ తెలిపారని.. మరి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా అని అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. సున్నా ఎకరాల నుంచి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ అని ఆరోపించారు.
ఎన్నికల అఫిడవిట్తో కల్వకుంట్ల ముఠా అడ్డంగా దొరికింది. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్కు భూములు భారీగా పెరిగిన విషయం స్వయంగా కేసీఆర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ద్వారా స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయి. కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి? ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా!
ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను కల్వకుంట్ల కుటుంబం అక్రమంగా సంపాదించుకున్నది. పుట్టుకతోనే కేసీఆర్కు వందల ఎకరాలు ఉన్నాయని డ్రామారావు బొంకుతున్నాడు. ఎన్నికల అఫిడవిట్లో తప్పులు రాసి మోసం చేసారా? లేదా ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా? అని పొంగులేటి నిలదీశారు.
సంబంధిత వార్తలు

Enquiry on KCR Lands | రేవంత్ ఆదేశం.. కేసీఆర్ ఫామ్హౌస్ భూములపై విచారణ షురూ
సెప్టెంబర్ 17, 2026

Theenmar Mallanna | బీసీల రాజ్యాధికారం కోసం మల్లన్న తొలి అడుగు.. గోల్కొండ కోట నుంచి రాజ్యాధికార యాత్ర షురూ
సెప్టెంబర్ 17, 2026

KTR | కేసీఆర్ ఆస్తులెన్నో, రేవంత్ ఆస్తులెన్నో విచారణకు సిద్ధం
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●NSE IPO | ఎన్ఎస్ఈ ఐపీవో నేడే.. షేర్ ధర రూ.1,785..
- ●Sobhita Dhulipala | పదహారేళ్లకే ఇళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయా - టాలీవుడ్పై శోభిత ధూళిపాళ కామెంట్స్ వైరల్
- ●BIS | బంగారం కొనేవారికి షాక్.. హాల్మార్కింగ్ ఛార్జీలు 66.7 శాతం పెంపు..
- ●PM Modi | మోదీ బర్త్డే.. 25 లక్షల దీపాలతో వెలుగులీననున్న ఉజ్జయిని
- ●Sabitha Indra Reddy | రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే... భట్టికి సీఎం పదవి ఇవ్వాలి
- ●1 Crore Corpus | 40 ఏళ్ల వయస్సు వరకు ఎస్ఐపీలో రూ.1 కోటి సంపాదిస్తే.. 50 ఏళ్లకు ఎంతవుతుంది?

NSE IPO | ఎన్ఎస్ఈ ఐపీవో నేడే.. షేర్ ధర రూ.1,785..

Sobhita Dhulipala | పదహారేళ్లకే ఇళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయా - టాలీవుడ్పై శోభిత ధూళిపాళ కామెంట్స్ వైరల్

BIS | బంగారం కొనేవారికి షాక్.. హాల్మార్కింగ్ ఛార్జీలు 66.7 శాతం పెంపు..

PM Modi | మోదీ బర్త్డే.. 25 లక్షల దీపాలతో వెలుగులీననున్న ఉజ్జయిని



