Harish Rao | హాస్టల్ విద్యార్థులకు రేవంత్ సరైన అన్నం పెట్టడం లేదు: హరీశ్రావు
Harish Rao | తెలంగాణ (Telangana) విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులకు సరైన అన్నం పెట్టడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. రేవంత్ను చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి తొండలు జొర్రించిన తక్కువేనని మండిపడ్డారు.
Harish Rao | తెలంగాణ (Telangana) విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులకు సరైన అన్నం పెట్టడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. రేవంత్ను చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి తొండలు జొర్రించిన తక్కువేనని మండిపడ్డారు. సిద్దిపేట (Siddipet) పట్టణంలోని నాసర్ పుర ఫిల్టర్ బెడ్ వద్ద గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో హరీశ్రావు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు అందించే గుడ్లు, బియ్యం, ఇతర దినుసులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనలో విఫలమవుతున్న రేవంత్ మళ్లీ గెలుస్తానని శపథాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కమిషన్లు కొట్టుడు, చిల్లర మాటలు మాట్లాడడం, పార్టీ లు మారడం, సీట్లు కొనడం రేవంత్కు అలవాటని దుయ్యబట్టారు. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్ (KCR) అని గుర్తు చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని, అటువంటి కేసీఆర్ను ఉద్దేశించి అలా మాట్లాడడం సరికాదన్నారు. సీఎంగా ఉండి వీధిరౌడీలాగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.

హాస్టల్ విద్యార్థుల సంరక్షణ గాలికి...
గత ప్రభుత్వంలో హాస్టళ్లకు పాత బియ్యం అందజేశామని, ప్రస్తుత ప్రభుత్వం సన్నబియ్యం అందజేస్తున్నప్పటికీ అన్నం మెత్తగా ముద్దలుగా అవుతోందని ఆరోపించారు. పిల్లలు చలితో చాలా ఇబ్బందులలో ఉన్నారని, అందుకే బ్లాంకెట్స్ పంపిణీ చేశామని చెప్పారు. గత 5నెలల నుంచి విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు చెల్లించడం లేదని, మెస్ బిల్లులు సైతం విడుదల చేయడం లేదని విమర్శించారు.
కమిషన్లు ఇచ్చిన వారికే బిల్లులు...
ప్రజలకు ఉపాధి, పర్యావరణ హిత నగరాన్ని రూపొందించేందుకు ఫార్మాసిటీని తాము అభివృద్ధి చేస్తే, దానిని ఇప్పుడు పూర్తిగా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చివేశారని అన్నారు. పెండింగ్ బిల్లులు గ్రీన్ చానెల్ ద్వారా ఇస్తామని చెబుతున్నప్పటికీ, ఎవరికీ ఇవ్వడం లేదని ఆరోపించారు. 20 శాతం కమిషన్ ఇచ్చే వాళ్లకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తున్నారని చెప్పారు. కమిషన్ ఇవ్వని వారికి డబ్బులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. చిల్లర మాటలు మాని పెండింగ్ బిల్లు లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



