త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు ప‌రిశ్ర‌మ‌) ఏర్పాటు చేయాలి: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు ప‌రిశ్ర‌మ‌)ను త‌క్ష‌ణ‌మే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు క‌లుగుతుంద‌ని అన్నారు.

A

Telangana | Published On Apr 18, 2026, 2.11 pm IST

CM Revanth Reddy | బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు ప‌రిశ్ర‌మ‌) ఏర్పాటు చేయాలి: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌ : బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు ప‌రిశ్ర‌మ‌)ను త‌క్ష‌ణ‌మే ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు క‌లుగుతుంద‌ని అన్నారు. ఈ మేర‌కు కేంద్ర ఉక్కు, భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, స‌హాయ‌మంత్రి భూప‌తిరాజు శ్రీ‌నివాస‌వ‌ర్మల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్ర‌తిపాద‌నల‌ను రేవంత్‌ కేంద్ర మంత్రుల‌కు వివ‌రించారు. తెలంగాణలో పాత వాహ‌నాల‌ స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రుల‌ను కోరుతూ వినతిపత్రం అందించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక‌త‌, భారీ ప‌రిశ్ర‌మ‌లు, పారిశ్రామిక ఉత్ప‌త్తికి ఉన్న అనుకూలత‌ల వ‌ల‌న దేశ పారిశ్రామిక ఉత్ప‌త్తి లక్ష్యాలకు హైద‌రాబాద్ కేంద్రంగా నిలుస్తుంద‌ని వివ‌రించారు. హైదరాబాద్ లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు. హైదరాబాద్‌ను 2034 నాటికి కాలుష్యం లేని నెట్ జీరో నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. ఆధునిక పరిశ్రమల‌కు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌నివాస‌రాజు, కేంద్ర ప్రాజెక్టుల స‌మ‌న్వ‌య ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement