Gandrapalli | మూడు నెలల్లో 28 మంది మృతి.. ఊరు ఖాళీ చేసిన ప్రజలు
Gandrapalli | ఇటీవల కాలంలో ఆ గ్రామంలో వరుసగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు నెలల్లోనే మూడు పదుల మంది చనిపోయారు. దీంతో గ్రామంలో ఏదో జరుగుతుందని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
Gandrapalli | త్రినేత్ర.న్యూస్: ఇటీవల కాలంలో ఆ గ్రామంలో వరుసగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు నెలల్లోనే మూడు పదుల మంది చనిపోయారు. దీంతో గ్రామంలో ఏదో జరుగుతుందని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏదో కీడు జరిగిందని భావించిన గ్రామ పెద్దలు.. ఊరు విడిచి వెళ్లాలలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి జనాలు సరేనన్నారు. ఒక రోజు ఉదయాన్నే అంతా కలసి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గండ్రపల్లిలో (Gandrapalli) జరిగింది.
గ్రామంలో వివిధ కారణాలతో గత మూడు నెలల్లో ఏకంగా 28 మంది మృతి చెందారు. వారిలో వృద్ధులే కాకుండా యువకులు కూడా ఉన్నారు. సాధారణంగా వయోభారంతో వృద్ధులు మరణిస్తూ ఉంటారు. కానీ యువకులు అర్థాంతరంగా చనిపోతుండటంతో గ్రామస్తుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గ్రామంలో ఏదో అరిష్టం దాగి ఉందని, అందుకే వరుసగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ మరణాల పరంపరకు ముగింపు పలకాలనుకున్న గ్రామ పెద్దలు.. పురోహితులను ఆశ్రయించారు. గ్రామ జాతకాన్ని పరిశీలించిన అతడు.. గ్రామానికి తీవ్రమైన కీడు సోకిందని, దానిని వదిలించుకోవాలంటే అందరూ కలిసి కీడు వంటలు నిర్వహించాలని సూచించారు.

దీంతో ఒక రోజు ముందుగానే గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. గురువారం తెల్లవారుజామునే గ్రామస్తులంతా తమ ఇండ్లకు తాళాలు వేసి, పిల్లాపాపలతో కలిసి గ్రామ పొలిమేరల వెలుపలికి వెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా వంటలు చేసుకుని, దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గ్రామం ఒక్కసారిగా నిర్మాణుష్యంగా మారిపోయింది. అయితే గ్రామ ప్రజల నమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ మరణాలకు గల అసలు కారణం మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.
అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి గ్రామంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవరసం ఉంది. ప్రతిఒక్కరిని పరిశీలించి మరణాలకు గలకారణాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. కలుషిత నీరు వల్లనా లేదా ఏదైనా అంటువ్యాధి, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయో తేల్చాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



