త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఫార్ములా ఈ-కారు రేసు కేసు.. రేపు కోర్టుకు కేటీఆర్‌

KTR | ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో న‌మోదైన కేసులు కేసులో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు కానున్నారు. ఈ కేసు విష‌యంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచార‌ణ‌ను ఏసీబీ ప్ర‌త్యేక కోర్టు జూలై 31కి వాయిదా వేసిన విష‌యం విదిత‌మే.

S

Telangana | Published On Jul 30, 2026, 3.44 pm IST

KTR | ఫార్ములా ఈ-కారు రేసు కేసు.. రేపు కోర్టుకు కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో న‌మోదైన కేసులు కేసులో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు కానున్నారు. ఈ కేసు విష‌యంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచార‌ణ‌ను ఏసీబీ ప్ర‌త్యేక కోర్టు జూలై 31కి వాయిదా వేసిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో రేపు కేటీఆర్‌తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అర‌వింద్ కుమార్ కోర్టు ఎదుట హాజ‌రు కానున్నారు.

ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో నిధుల వినియోగం, పరిపాలనా నిర్ణయాలకు సంబంధించిన విష‌యాల‌పై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు నిందితులంద‌రూ రేపు కోర్టు ఎదుట‌ హాజ‌రు కానుండ‌డంతో న్యాయ‌స్థానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతోంద‌నే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

Advertisement
Advertisement