త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gottimukkala Padmarao | ప్ర‌ముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్య‌మకారుడు గొట్టిముక్కల పద్మారావు క‌న్నుమూత‌

Gottimukkala Padmarao | ప్రముఖ‌ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు (Gottimukkala Padmarao) క‌న్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో ఉన్న‌ ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

G

Telangana | Published On Jun 21, 2026, 8.55 am IST

Gottimukkala Padmarao | ప్ర‌ముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్య‌మకారుడు గొట్టిముక్కల పద్మారావు క‌న్నుమూత‌
Advertisement

Gottimukkala Padmarao | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రముఖ‌ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు (Gottimukkala Padmarao) క‌న్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో ఉన్న‌ ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పద్మారావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా టాలీవుడ్‌లో పలు చిత్రాలను నిర్మించారు. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వ‌చ్చిన 'ఏప్రిల్ 1 విడుదల' సినిమాను ప‌ద్మారావు నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌తోనే 'జోకర్' చిత్రాన్ని, సుమన్ హీరోగా 'కంచు కవచం' అనే సినిమాల‌ను రూపొందించారు.

తెలంగాణ ఉద్య‌మంలో కూడా ప్ర‌ముఖ పాత్ర పోషించారు. భారత‌ రాష్ట్ర సమితిలో కీలక నాయకుడిగా పనిచేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి నాటి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

 

Advertisement
Advertisement