త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య వ్యాఖ్య‌లు అవివేకం : మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

Niranjan Reddy | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభ‌జ‌న‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు అవివేకం అని మండిప‌డ్డారు.

S

Telangana | Published On Apr 16, 2026, 4.27 pm IST

Niranjan Reddy | బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య వ్యాఖ్య‌లు అవివేకం : మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభ‌జ‌న‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు అవివేకం అని మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్, భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గం అని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

భారత రాజ్యాంగానికి లోబడి దేశ అత్యున్నత పార్లమెంట్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితం. దశాబ్దాల పోరాటం మూలంగా తెలంగాణ సాక్షాత్కరించింది. మిడిమిడిజ్ఞానం, అవగాహన లేమితో బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అవాకులు, చెవాకులు పేలుతున్నారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మీద దాడి చేస్తున్నది అని నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

తెలంగాణ ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండించాలి. పార్లమెంటులో తెలంగాణ విభజన విషయంలో చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ, బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement