త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కేసీఆర్ స్పీచ్ లైవ్‌లో 36 ల‌క్ష‌ల మంది చూస్తే.. రేవంత్ స్పీచ్‌కు 4 ల‌క్ష‌లే

Harish Rao | నిన్న జ‌గిత్యాల వేదిక‌గా మాజీ సీఎం కేసీఆర్.. కాటారం వేదిక‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన విష‌యం తెలిసిందే. అయితే కేసీఆర్ స్పీచ్ లైవ్‌లో 36 ల‌క్ష‌ల మంది వీక్షించార‌ని, రేవంత్ రెడ్డి ప్ర‌సంగాన్ని కేవ‌లం 4 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే చూశార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు.

S

Telangana | Published On Apr 21, 2026, 5.41 pm IST

Harish Rao | కేసీఆర్ స్పీచ్ లైవ్‌లో 36 ల‌క్ష‌ల మంది చూస్తే.. రేవంత్ స్పీచ్‌కు 4 ల‌క్ష‌లే
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : నిన్న జ‌గిత్యాల వేదిక‌గా మాజీ సీఎం కేసీఆర్.. కాటారం వేదిక‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన విష‌యం తెలిసిందే. కేసీఆర్ ప్ర‌సంగం ప్రారంభ‌మైన కొన్ని నిమిషాల‌కు రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. అయితే కేసీఆర్ స్పీచ్ లైవ్‌లో 36 ల‌క్ష‌ల మంది వీక్షించార‌ని, రేవంత్ రెడ్డి ప్ర‌సంగాన్ని కేవ‌లం 4 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే చూశార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సభ జరుగుతుందని ముందే తెలిసి, ఆ సభకు పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన కుంచిత బుద్ధికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. కేసీఆర్ స్పీచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

నిన్న కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్ లో 36 లక్షల మంది చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారు. కేసీఆర్ వ్యూవర్ షిప్‌లో కనీసం 10 శాతం కూడా రేవంత్‌కు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ లైవ్‌లో బీఆర్ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్‌లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కేసీఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement