Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లాలో వింత ఘటన వెలుగు చూసింది. గ్రామంలో వానలు పడడం లేదని.. మూడు నెలల క్రితం పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పెట్రోల్ పోసి దహనం చేశారు.
Nagarkurnool | త్రినేత్ర.న్యూస్ : నాగర్కర్నూల్ జిల్లాలో వింత ఘటన వెలుగు చూసింది. గ్రామంలో వానలు పడడం లేదని.. మూడు నెలల క్రితం పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పెట్రోల్ పోసి దహనం చేశారు.
పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు.. మూడు నెలల క్రితం హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించి ఖననం చేశారు.
అయితే అప్పట్నుంచి కోడోనిపల్లిలో వర్షాలు కురియడం లేదని స్థానికుల అభిప్రాయం. శవాన్ని దహనం చేయకుండా ఖననం చేసినందుకు వర్షాలు పడడం లేదని గ్రామస్తులు భావించారు. దీంతో గ్రామ పెద్దల నిర్ణయం మేరకు జేసీబీ సహాయంతో శవాన్ని బయటకు వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని కట్టెలపై ఉంచి పెట్రోల్ పోసి దహనం చేశారు గ్రామస్తులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి.. ఇలాంటి మూఢనమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను, అధికారులను యువకులు కోరారు.
తాజావార్తలు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..
- ●BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలు
- ●MLA Mallareddy | మంత్రి పొంగులేటి పాలు పొంగినట్టు పొంగుతున్నాడు : ఎమ్మెల్యే మల్లారెడ్డి
- ●CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి
- ●Python Jodie Foster | కొండ చిలువకు క్యాన్సర్ చికిత్స.. ప్రపంచంలోనే ఇది తొలిసారి
- ●Baingan Bharta | వంకాయ కూర తిన్నాక.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు..

Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..

BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలు

MLA Mallareddy | మంత్రి పొంగులేటి పాలు పొంగినట్టు పొంగుతున్నాడు : ఎమ్మెల్యే మల్లారెడ్డి

CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయండి






