త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kiran Kumar Reddy | ఒక్క రూపాయికే శార‌దా పీఠానికి భూములిచ్చారు : ఎంపీ చామ‌ల‌

MP Chamala Kiran Kumar Reddy | గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో రూ. 150 కోట్ల విలువైన కోకాపేట్ భూముల‌ను కేవ‌లం ఒక్క రూపాయికే శార‌దా పీఠానికి అప్ప‌గించారు అని భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

S

Telangana | Published On Feb 28, 2026, 4.33 pm IST

MP Chamala Kiran Kumar Reddy | ఒక్క రూపాయికే శార‌దా పీఠానికి భూములిచ్చారు : ఎంపీ చామ‌ల‌
Advertisement

శంషాబాద్‌కు శార‌దా పీఠం..
కాంగ్రెస్‌కు భ‌క్తిశ్ర‌ద్ధ‌లున్నాయి..
మూసీకి, సబ‌ర్మ‌తికి సంబంధముంది..
హ‌రీశ్‌రావు, రామ‌చంద‌ర్ రావుపై ఎంపీ చామ‌ల ఫైర్

MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో రూ. 150 కోట్ల విలువైన కోకాపేట్ భూముల‌ను కేవ‌లం ఒక్క రూపాయికే శార‌దా పీఠానికి అప్ప‌గించారు అని భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాధాన్యత కూడిన ప్రాంతాల్లో న‌చ్చిన వారి కోసం భూముల‌ను బీఆర్ఎస్ నాయ‌కులు పంచారని మండిప‌డ్డారు. కోకాపేట్ భూముల‌పై బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు చేసిన వ్యాఖ్య‌లకు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.

శారదా పీఠం భూమిని వాళ్ళ అనుమతితో శంషాబాద్ తరలిస్తున్నారు. శార‌దా పీఠం ఉన్న ఏరియాలో ప్రజలకు మంజీరా నీళ్లు అందించడానికి వాటర్ వర్క్స్ జరుగుతున్నవి. కోర్ అర్బన్ ఏరియాలో మెట్రో, మూసీని అభివృద్ధి చేయడం ప్రజల కోసమే. కానీ ఎక్క‌డా కూడా అభివృద్ధి జ‌ర‌గొద్ద‌ని హ‌రీశ్‌రావు, కేటీఆర్ అడ్డుప‌డుతున్నారు. వారిద్ద‌రి పోజిష‌న్ ఏంటో తెలియ‌దు. మేము అపోజిష‌న్ అంటున్నాం. మా ప్రభుత్వానికి కూడా భక్తిశ్రద్ధలు ఉన్నాయి. వేములవాడ, సమ్మక్క సారక్క దేవాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలో మంచి జరిగితే మళ్ళీ కాంగ్రెస్‌కు పట్టం కడతారని హరీశ్‌రావు, కేటీఆర్ విష బీజాలు వేస్తున్నారు. మీలాగ కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదు అని చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు.

గుజరాత్‌లో మోదీ సబర్మతిని అభివృద్ధి చేసినట్లు.. తెలంగాణ‌లో మూసీ అభివృద్ధి జ‌ర‌గొద్దా..? సబర్మతికి, మూసీకి సంబంధం లేదు అని రామచందర్ రావు అంటుండు. మూసీకి సబర్మతికి ఎందుకు సంబంధం లేదు. గాంధీ న‌గ‌ర్‌లో న‌ది ఒడ్డున ఎన్ని ఇండ్లను త‌ర‌లించారు. మీరు అక్ర‌మంగా ఇండ్ల‌ను త‌ర‌లించొచ్చు కానీ.. ఇక్క‌డ చేయ‌కూడ‌దా..? ఢిల్లీలో ఒక మాట‌.. గ‌ల్లీలో ఒక మాట మాట్లాడితే ఎలా..? అని ఎంపీ చామ‌ల ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement