త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | ఎల్లుండి నుంచే రెండో విడ‌త రైతు భ‌రోసా.. కొత్త రైతుల‌కు కూడా..!

Rythu Bharosa | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండో విడుత రైతు భ‌రోసా నిధుల విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 20వ తేదీన భూపాల‌ప‌ల్లి జిల్లాలోని కాటారం వేదిక‌గా రెండో విడుత నిధుల‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుద‌ల చేయ‌నున్నారు.

S

Telangana | Published On Apr 18, 2026, 6.04 pm IST

Rythu Bharosa | ఎల్లుండి నుంచే రెండో విడ‌త రైతు భ‌రోసా.. కొత్త రైతుల‌కు కూడా..!
Advertisement

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండో విడుత రైతు భ‌రోసా నిధుల విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 20వ తేదీన భూపాల‌ప‌ల్లి జిల్లాలోని కాటారం వేదిక‌గా రెండో విడుత నిధుల‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుద‌ల చేయ‌నున్నారు.

కొత్త రైతుల‌కు కూడా..

కొత్తగా భూములు కొనుగోలు చేసి, పట్టాదారు పాస్‌బుక్‌లు పొందిన రైతులకు రెండో విడుత‌లో ప్రాధాన్యత ల‌భించ‌నుంది.

రెండో విడుతలో 45,11,947 మంది రైతుల‌కు

ఈ పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ గత నెల 23వ తేదీన మొదటి విడుత రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి రైతుకు ఒక ఎకరానికి సరిపడే పెట్టుబడి సాయం ముందుగా విడుదల చేసింది. దాదాపు రూ.3,590 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. రెండో విడుతలో 45,11,947 మంది రైతులు రైతు భరోసా సాయం అందుకుంటారు. దీంతో రూ.5653 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతం, మూడో విడత నిధులను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Advertisement
Advertisement