త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు

Congress MLAs Complaint to TGSCW | అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షర్టులు విప్పి, విధుల్లో ఉన్న మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల వద్దకు వెళ్లి, వారి చేతులు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి, యశస్విని రెడ్డి, పర్ణిక రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On Sep 11, 2026, 7.25 pm IST

Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు
Advertisement

Congress MLAs Complaint to TGSCW | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షర్టులు విప్పి, విధుల్లో ఉన్న మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల వద్దకు వెళ్లి, వారి చేతులు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి, యశస్విని రెడ్డి, పర్ణిక రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను కోరారు.

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎర్రవల్లి గ్రామంలో దళితులు నడిచిన దారిలో బీఆర్ఎస్ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై ఎమ్మెల్యే, టిపీసీసీ ఎస్సీ సెల్ చైర్మెన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని కొత్త‌గూడెం గ్రంథాల‌య చైర్మెన్ ప‌సుపులేటి వీర‌బాబు, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి గిడ్ల అమృత రావు, మధు, భార్గవ్ ఆధ్వర్యంలో వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు సిబ్బంది మరియు ఇతర అధికారుల పట్ల అనుచితంగా, అగౌరవంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌ను కాంగ్రెస్ నేత‌లు కోరారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర బోయ కమ్యూనిటీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నరేష్, టీపీసీసీ మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రాన్ని సమర్పించారు.

Advertisement
Advertisement