Revanth Reddy | కాన్వాయ్ని తగ్గించండి.. మోదీ బాటలో సీఎం రేవంత్
Revanth Reddy | ప్రధాని మోదీ బాటలోనే సీఎం రేవంత్ (Revanth Reddy) పయణిస్తున్నారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం(Energy Crisis) నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రధాని మోదీ బాటలోనే సీఎం రేవంత్ (Revanth Reddy) పయణిస్తున్నారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం(Energy Crisis) నేపథ్యంలో దేశ ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. స్వయంగా ప్రధాని కూడా తన కాన్యాయ్ని కుదించుకున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ ట్రాన్స్పోర్టును ఉపయోగించేలా ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్లోని వాహనాలను అవసరం మేర తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఇంటిలిజెన్స్ అధికారులు కాన్వాయ్ తగ్గింపుపై కసరత్తు కూడా ప్రారంభించారు.
ప్రధాని పొదుపు బాట..
పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని, వృథా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించిన మోదీ.. స్వయంగా వాటిని పాటించేందుకు సిద్ధమయ్యారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా తన కాన్వాయ్లో (Convoy) వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని మోదీ ఆదేశించారు. అదే సమయంలో కాన్వాయ్లో విద్యుత్ కార్ల వినియోగాన్ని (Electric Vehicles) పెంచాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)కి మోదీ సూచించారు. ప్రధాని సూచనల మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చర్యలు తీసుకున్నారు. వాహనాల సంఖ్యను రెండుకు పరిమితం చేశారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని వెళ్లే మార్గాల్లో మాత్రం తప్పనిసరిగా భద్రతా ఏర్పాట్లు కొనసాగించనున్నారు.
ప్రధాని పిలుపుమేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఆచరణలోకి దిగారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించాలని ఆదేశింఆచరు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ తమ కాన్వాయ్లో అనవసరపు వాహనాలు ఉండకూడదని సిబ్బందికి సూచించించారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయించారు. పలువురు మంత్రులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

PM Modi | UAE క్వీన్ మదర్కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్ను కానుకగా ఇచ్చిన ప్రధాని మోదీ
మే 21, 2026

PM Modi | మెలోనీకి ప్రత్యేక కానుకలు ఇచ్చిన ప్రధాని మోదీ.. అవేంటంటే..?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



