త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | 2న ఉదయం 8.30 గంట‌ల‌కే రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుకలు.. సీఎం రేవంత్ ఆదేశం

CM Revanth Reddy | జూన్ 2వ తేదీన రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుకల‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మండుటెండల కారణంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఉదయం పూట నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు.

S

Telangana | Published On May 30, 2026, 5.40 pm IST

CM Revanth Reddy | 2న ఉదయం 8.30 గంట‌ల‌కే రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుకలు.. సీఎం రేవంత్ ఆదేశం
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : జూన్ 2వ తేదీన రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుకల‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మండుటెండల కారణంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఉదయం పూట నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధికారులను ఆదేశించారు.

జూన్​ 2న పేరేడ్​ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకలను ఉదయం 8.30కే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేడుకలకు హాజరయ్యే అతిథులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ సూచించారు.

Advertisement
Advertisement